E-Paper
Advertisement

Death Case : వీడిన మిస్టరీ.. దమ్మాయిగూడ బాలిక మృతికి కారణమిదే..!

Death Case : వీడిన మిస్టరీ.. దమ్మాయిగూడ బాలిక మృతికి కారణమిదే..!
Advertisement

Death Case : మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ అంబేడ్కర్‌ నగర్‌లో బాలిక ఇందు (10) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి మృతిపై అనుమానాలు లేవని శవపరీక్ష నివేదికలో వైద్యులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. చెరువులో జారిపడటంతో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

ఈ కేసు నేపథ్యం..
డిసెంబర్ 15న పాఠశాలకెళ్లి ఇందు అదృశ్యమైంది. ఆ తర్వాత రోజు బాలిక మృతదేహం అనుమానాస్పదస్థితిలో చెరువులో లభ్యమైంది. జవహర్‌నగర్‌ పరిధి ఎన్టీఆర్‌నగర్‌కాలనీలో పాత సామగ్రి సేకరిస్తూ జీవిస్తున్న జీడల నరేష్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారు ముగ్గురు దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆ రోజు ఉదయం చిన్న కుమార్తె ఇందు(10), కుమారుడి(12)ను తీసుకొని తండ్రి నరేష్‌ బైక్ పై పాఠశాలకు బయలుదేరాడు. పని ఉందంటూ పిల్లలిద్దరిని మధ్యలో దింపి నడిచి వెళ్లమని చెప్పారు. వారు నడుచుకుంటూ బడికెళ్లారు.

Advertisement

కొద్దిసేపటి తర్వాత పుస్తకం మరిచిపోయాను తెచ్చుకుంటానని ఇందు ఒంటరిగా పాఠశాల నుంచి బయటికెళ్లింది. ఉపాధ్యాయుడు విద్యార్థిని రాలేదని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు 100కు సమాచారం ఇచ్చారు.

ఆ రోజు సాయంత్రం వరకూ ఎదురుచూసినా బాలిక ఆచూకీ తెలియలేదు. పోలీసులు రాత్రి 7.30 గంటల సమయంలో డాగ్‌స్క్వాడ్‌తో గాలింపు చేపట్టగా.. పాఠశాల నుంచి దమ్మాయిగూడ చెరువు వరకూ వెళ్లాయి. సీసీఫుటేజీలు పరిశీలించగా.. బాలిక గురువారం ఉదయం 9.23గంటల సమయంలో పాఠశాల సమీపం నుంచి ఒంటరిగా వెళ్తున్నట్లు గుర్తించారు. దమ్మాయిగూడ చెరువు మార్గంలో బాలిక పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు విచారణను కొనసాగించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు.. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతోనే బాలిక ఇందు మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×