E-Paper
Advertisement

TG Replaces TS: ఇక నుంచి TS కాదు TG.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

TG Replaces TS: ఇక నుంచి TS కాదు TG.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం!
Advertisement

TG Replaces TS: ఇక నుంచి టీఎస్ నుంచి టీజీగా ప్రస్తావించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఇక నుంచి తెలంగాణను టీఎస్ కు బదులుగా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా కూడా టీఎస్ కు బదులు టీజీగా ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, ఏజెన్సీలు, అటానమస్ విభాగాలన్నింటిలోనూ వెంటనే అమలు చేయాలని అందులో పేర్కొన్నది. అదేవిధంగా నోటిఫికేషన్లు, నివేదికలు, జీవోలు, లెటర్ హెడ్ లలో టీజీ అనే పేర్కొనాలని సీఎస్ స్పష్టం చేసింది.

Advertisement

అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసుల నేమ్ బోర్డ్స్, వెబ్ సైట్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో టీజీ ఉండాలని తెలిపారు. టీఎస్ అని ముద్రించి స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్ ను వెంటనే తొలగించి.. టీజీతో కొత్తగా ముద్రించాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేసి ఈ నెల 31 వరకు సాధారణ పరిపాలన శాఖకు నివేదికను సమర్పించాల్సిందిగా వివిధ శాఖల కార్యదర్శులను ఆమె ఆదేశించారు.

Also Read: ఆ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్.. జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచన

Advertisement

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగలన్నీ కూడా టీఎస్ కు బదులుగా టీజీగా ప్రస్తావించనున్నాయి. గవర్నమెంట్ ఆఫీసులలో నేమ్ బోర్డులలో టీఎస్ కు బదులు, టీజీ కనిపించనున్నది.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం కోడ్ అబ్రివేషన్ ను టీఎస్ కు బదులు టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, గతంలో తెలంగాణ ఏర్పడినంక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోడ్ ను టీఎస్ గా నిర్ణయించింది. అప్పటి నుంచి అదే కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక TS పేరును TG మారుస్తూ మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Also Read: EX-Minister Mallareddy Arrest : భూ వివాదం.. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్

అనంతరం తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను స్వీకరించిన కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో అంగీకరించింది. ఇందుకు సంబంధించి గెజిట్ ను కూడా విడుదల చేసింది. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రావడంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్లతోపాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, ఇతర ప్రభుత్వ సంబంధిత అంశాలలో కూడా రాష్ట్రం కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆఫీసులలో నేమ్ బోర్డులు, లెటర్ హెడ్స్, స్టాంపులు, ఏజెన్సీలు, నోటిఫికేషన్లు, నివేదికలు, జీవోలలో ఇక నుంచి టీఎస్ కు బదులు టీజీగా పేర్కొననున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×