E-Paper
Advertisement

3 నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్.. ఆదిలాబాద్‌కు డబుల్ ధమాకా, రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

3 నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్.. ఆదిలాబాద్‌కు డబుల్ ధమాకా, రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Advertisement

తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మరో ప్రధాన విమానాశ్రయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు ఫీజిబిలిటీ ఉన్న చోట్ల కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

వరంగల్ విమానాశ్రయం పనులు ఇప్పటికే వేగవంతమయ్యాయి. వచ్చే మూడు నెలల్లోనే దీనికి పునాది రాయి వేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. తెలంగాణకు ముఖద్వారమైన ఆదిలాబాద్ పారిశ్రామికంగా, పర్యాటకంగా ఎదిగేందుకు అక్కడ విమానాశ్రయం నిర్మించాలనేది దశాబ్దాల కల. కిషన్ రెడ్డితో కలిసి నిర్వహించిన నిరంతర చర్చలు ఇప్పుడు సాకారం కాబోతున్నాయి. ఆదిలాబాద్‌లో ఇప్పటికే 360 ఎకరాల రక్షణ శాఖ భూమి ఉంది. దీనికి అదనంగా మరో 450 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

Advertisement

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విషయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంపూర్ణ సహకారం అందించారు. వ్యూహాత్మక ప్రాంతం కావడం వల్ల వైమానిక దళ శిక్షణకు ఇది అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ విమానాశ్రయాన్ని రక్షణ శాఖే స్వయంగా నిర్మించనుంది. అదే ప్రాంగణంలో సామాన్య ప్రజల కోసం పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా టర్మినల్‌ను ఏర్పాటు చేస్తుంది. రక్షణ, పౌర విమానయాన శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నాయి. ఏప్రిల్ 17న ఓఎల్ఎస్ సర్వే నిర్వహించిన అనంతరం రన్‌వే ఓరియంటేషన్, మాస్టర్ ప్లాన్‌పై స్పష్టత వస్తుంది.

ఆదిలాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అది ఒక కమర్షియల్ హబ్‌గా మారుతుంది. భూసేకరణలో ఎలాంటి సమస్యలు లేవని స్థానిక ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో పౌర విమాన సేవలు అందించే 36 విమానాశ్రయాలు ఉన్నాయి. అదే నమూనాలో ఆదిలాబాద్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. భూమిని రక్షణ శాఖకు అప్పగించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రం సహకరిస్తే కేంద్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉంది.

Advertisement

పెద్దపల్లి జిల్లాలో కూడా విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై కేంద్రం నిర్వహించిన ఫీజిబిలిటీ రిపోర్టు సానుకూలంగా వచ్చింది. అక్కడ విమానాశ్రయం కోసం కనీసం 600 నుంచి 700 ఎకరాలు అవసరమవుతాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే 1200 ఎకరాల వరకు సేకరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాచారం రాగానే తదుపరి చర్యలు తీసుకుంటారు. కొత్తగూడెం విషయంలో మాత్రం ప్రభుత్వం చూపిన భూమి సాంకేతికంగా అనుకూలం కాదని కేంద్రం స్పష్టం చేసింది.

ALSO READ: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, అవి ఏంటంటే..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×