E-Paper
Advertisement

Padma Awardees Felicitation : “పద్మ” గ్రహీతలను సత్కరించిన సీఎం రేవంత్.. హాజరైన మంత్రులు

Padma Awardees Felicitation : “పద్మ” గ్రహీతలను సత్కరించిన సీఎం రేవంత్.. హాజరైన మంత్రులు
Advertisement
Padma Awardees Felicitation

Padma Awardees Felicitation(Latest news in telangana): ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పద్మవిభూషణ్‌ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, కేతావత్‌ సోమ్‌లాల్‌, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కూరెళ్ల విఠలాచార్యను సత్కరించారు. తెలుగువారు పద్మ పురస్కారాలకు ఎంపిక కావటం తెలుగుప్రజలందరికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పద్మ పురస్కారాలకు ఎంపికైన కవులు, కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. వారికి రూ.25 లక్షలు, ప్రతినెలా రూ.25 వేలు ప్రభుత్వం తరపున అందజేస్తామని తెలిపారు.

చిరంజీవి తనకు పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో విందు కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెగాస్టార్‌కు ఆయన పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రామ్ చరణ్‌తో కొద్దిసేపు ముచ్చటిించారు. ఈ విందుకు శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×