E-Paper
Advertisement

Hage Geingob : నమీబియా అధ్యక్షుడు కన్నుమూత..

Hage Geingob : నమీబియా అధ్యక్షుడు కన్నుమూత..
Advertisement

Hage Geingob : నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (Hage Geingob) (82) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం దేశ రాజధాని అయిన విండ్ హెక్ లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఇటీవలే హేజ్ గింగోబ్ కు క్యాన్సర్ నిర్థారణ అవ్వగా.. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లినట్లు వార్తలొచ్చాయి. అంతలోనే ఆయన చనిపోయారన్న వార్త.. ఆ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

2015 లో హేజ్ గింగోబ్ నమీబియా అధ్యక్షుడిగా ఎన్నికై.. దీర్ఘకాలంపాటు దేశాన్ని పాలించారు. ఆయన మృతితో అంగోలో ముంబా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. త్వరలోనే కేబినెట్ భేటీ నిర్వహించి.. తదుపరి కార్యాచరణపై ప్రకటన చేస్తామని అంగోలో ముంబా తెలిపారు. హేజ్ గింగోబ్ మృతి దేశానికి తీరని లోటని తెలిపారు. నవంబరులో అక్కడ అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×