E-Paper
Advertisement

MLA Murali Naik: అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటెయ్యండి: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్

MLA Murali Naik: అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటెయ్యండి: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
Advertisement

MLA Murali Naik: స్వేఛ్చ బ్యూరబో: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం సంక్షేమం, పట్టణాల అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) పేర్కొన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన అభ్యర్థులను సర్వేలు చేసిన అనంతరమే ఎంపిక చేసి వార్డు కౌన్సిలర్ గా నియమించామన్నారు. నిరుపేదల కోసం పనిచేసే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చామని, వారంతా మునిసిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని వెల్లడించారు. 32 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ తరఫున బి ఫామ్ లను అందజేశామన్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పోటీ చేసే 32 వార్డులను సైతం కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

వామపక్షాలతోనే మునిసిపాలిటీ అభివృద్ధి..

వామపక్షాల సహకారంతోనే మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తెలిపారు. మొదటినుంచి సిపిఐ పార్టీతో పొత్తు ఉంటుందని, ఆ నేపథ్యంలోనే సిపిఐ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సిపిఎం( CPM) పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వడంతో పాటు మరొక వార్డులో ఫ్రెండ్లీ పోటీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీకి కూడా నాలుగు వార్డులు కేటాయించి మరొక వార్డులో ఫ్రెండ్లీ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. అయితే సిపిఐ పార్టీకి 6 నుంచి 7 సీట్లు కావాలనడంతో మునిసిపాలిటీలో పొత్తు కుదరలేదన్నారు. దీంతో సిపిఐ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో వెళ్లారని వివరించారు. సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి మునిసిపాలిటీ అభివృద్ధిని చేపడుతామన్నారు.

Advertisement

Also Read: Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

రెండేళ్లలో రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు

ఇటీవలనే మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ. 80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇందులో రూ.20 కోట్లతో తాగునీటి కోసం ఖర్చు చేశామన్నారు. రూ. 60 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. మున్సిపాలిటీలో పోటీ చేసే వార్డు కౌన్సిలర్లు 50 శాతం మంది కొత్త వారేనని వారిని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తారని వివరించారు.

Advertisement

Also Read: Sai Pallavi: ఫ్లాప్ హీరో కోసం ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×