E-Paper
Advertisement

Telangana Govt: పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. డిప్యూటేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Telangana Govt: పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్.. డిప్యూటేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Advertisement

Telangana Govt:  తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెండు సంవత్సరాల పాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్‌పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు . ఈ నిర్ణయం వెనుక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక పాత్ర పోషించారు. జీవో 317 వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీరియస్‌గా తీసుకున్న మంత్రి సీతక్క, పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు.

Also Read: Huzurabad Municipal: హుజురాబాద్ మున్సిపల్ కౌంటింగ్‌లో షాకింగ్ సీన్.. ఉద్యోగులు వేసిన ఓట్లు చెత్త బుట్టలోకే!

ప్రభుత్వం జీవో 190 జారీ

Advertisement

జీవో 317 వల్ల జరిగిన నష్టాలను సరిదిద్దేందుకు కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం జీవో 190 జారీ చేసింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా అంతర్ జిల్లా డిప్యూటేషన్ ప్రక్రియను ప్రారంభించిన తొలి శాఖగా పంచాయతీ రాజ్ శాఖ నిలవడం మంత్రి సీతక్క కృషికి నిదర్శనం. ఖాళీలున్న ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా డిప్యూటేష‌న్ల‌కు అనుమ‌తులిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పరిపాలన బలోపేతం చేయడం, సిబ్బందికి న్యాయం చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దుతూ, పారదర్శకంగా, న్యాయబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో పంచాయతీ కార్యదర్శులకు గణనీయమైన ఉపశమనం లభించడంతో పాటు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలుకానున్నాయి. మంత్రి సీతక్క నాయకత్వంలో పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది సంక్షేమం మరియు గ్రామీణ పరిపాలన బలోపేతానికి కట్టుబడి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వం, మంత్రి సీతక్కకు సంఘాల ధన్యవాదాలు

ఈ నిర్ణయంపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ సమస్యలను సానుకూలంగా పరిగణించి వేగంగా పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం, మంత్రి సీతక్కకు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికత కోల్పోయి కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్న పంచాయతీ కార్యదర్శులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగించిందని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని న్యాయం చేసిన మంత్రి సీతక్కకు, శాఖ అధికారుల‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ చేశారు.

Advertisement

Also Read: Telangana Govt: మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కసరత్తు.. అర్హులైన వారందరికీ ఇంటికే సరుకులు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×