E-Paper
Advertisement

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!
Advertisement

Stubble Burning: స్వేచ్చ బ్యూరో: కొందరు రైతుల బాధ్యతారాహిత్యం తోటి రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. పొలాల్లో వరికొయ్యలను తగులబెట్టవద్దని అధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నా, కొందరి నిర్లక్ష్యం వల్ల ఒక రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోట పూర్తిగా బూడిదైన విషాద ఘటన హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఎగసిపడిన అగ్నికీలలు.. 45 ఆయిల్ పామ్ చెట్లు దహనం

వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ అనే రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోట పక్కన.. కొందరు రైతులు పంట కోతల అనంతరం మిగిలిన వరికొయ్యలను తగులబెట్టారు. ఎండ తీవ్రత, ఈదురుగాలుల వల్ల ఆ మంటలు వేగంగా మహేందర్ తోటకు వ్యాపించాయి. రాత్రి వరకు మంటలు ఎగసిపడటంతో దాదాపు 45 ఆయిల్ పామ్ చెట్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో మిగిలిన తోట తృటిలో తప్పించుకుందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.

Advertisement

Also read; ‘తెలంగాణ సెంటిమెంట్.. ఒక ఫ్యాషన్ అయ్యింది’.. బీఆర్ఎస్‌పై రఘునందన్ రావు ఫైర్

అధికారుల హెచ్చరికలు పెడచెవిన పెట్టడమే కారణం..

వరికొయ్యలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా, ఇలాంటి పెను ప్రమాదాలు జరుగుతాయని వ్యవసాయ శాఖ ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు రైతులు పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. గతంలోనూ ఇక్కడ వరికొయ్యల మంటల వల్ల గడ్డివాములు, విద్యుత్ మోటార్లు కాలిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రైతులు ఈ ప్రమాదకర అలవాటును మానుకోకపోతే చట్టపరమైన చర్యలతో పాటు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read; కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×