E-Paper
Advertisement

Sharmila : వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలన.. షర్మిలకు అస్వస్థత..

Sharmila : వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలన.. షర్మిలకు అస్వస్థత..
Advertisement

Sharmila : ఖమ్మం జిల్లా పర్యటనలో YSRTP అధ్యక్షురాలు షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతుండగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పక్కనున్న వారు వెంటనే అప్రమత్తమై.. ఆమెను కింద కూర్చోబెట్టారు. కొంచెం స్పృహలోకి వచ్చాక మంచినీళ్లు అందించారు. దీంతో షర్మిల తేరుకున్నారు.

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. పొలాల్లోకి వెళ్లి.. దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. వారి సమస్యలు విన్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని షర్మిలకు రైతులు చెప్పుకున్నారు.పెట్టుబడి కూడా రాక అప్పులపాలయ్యామని తెలిపారు.

Advertisement

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల మండిపడ్డారు. ఫసల్ బీమా అమలు చేయడం లేదని ఆరోపించారు. మార్చి నెలలో కురిసిన వర్షాలకు. .2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికీ రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేసీఆర్ గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పారని విమర్శించారు. ఏప్రిల్ 29న వరంగల్ జిల్లాలోనూ షర్మిల పర్యటించారు. రైతుల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×