E-Paper
Advertisement

Congress: పీసీసీ చీఫ్‌కు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు.. నమ్మాల్సిందే మరి..

Congress: పీసీసీ చీఫ్‌కు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు.. నమ్మాల్సిందే మరి..
Advertisement
Congress

Congress: కోటి ఉంటేనే కోటీశ్వరుడు అంటారు. అలాంటిది పదులు, వందల కోట్లు ఉన్నవారిని చూస్తే అంతా అవాక్కవుతుంటారు. వారి గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. అంబానీ, అదానీ లాంటి బిజినెస్‌మెన్ దగ్గర భారీ సంపద ఉండటం ఆశ్చర్యకరమేమీ కాదు. కానీ, రాజకీయ నాయకులు కోట్లకు కోట్లు పోగేస్తుండటమే చర్చనీయాంశం. అయితే, అందరు పొలిటిషియన్స్ ఒకేలా ఉండరు. కొందరు అక్రమార్జనతో ధనవంతులు అయితే.. మరికొందరు మాత్రం మొదటి నుంచీ సంపన్నులుగానే ఉన్నారు. రాజకీయాలతో పాటు వ్యాపార సామ్రాజ్యాన్నీ ఏలుతున్నారు. అలాంటి వారిలో కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఒకరు.

కాంగ్రెస్ నేతల్లోకెళ్లా రిచెస్ట్ లీడర్ డీకే శివకుమార్. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో. ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ మరి. తాజాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. అప్పటి నుంచీ ఆయన సంపద గురించి మరోసారి చర్చ.

Advertisement

మొత్తం తన ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు డీకే. ఆస్తులే కాదు అప్పులూ భారీగానే ఉన్నాయ్ ఆయనకు. 263 కోట్ల అప్పులు ఉన్నట్టు చూపించారు.

అంత ఆస్తి ఉన్నాయనకు బంగారం, కార్లకు కొదవేముంటుంది. కానీ, తన దగ్గర ఒకేఒక కారు ఉన్నట్టు వెల్లడించారు శివకుమార్. రెండు ఖరీదైన వాచ్‌లు ఉన్నాయట. ఇక, గోల్డ్ మాత్రం బాగానే కొన్నారు. 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్టు తెలిపారు కన్నడ పీసీసీ చీఫ్.

Advertisement

ఆస్తులు, అప్పులే కాదు.. కేసులూ ఎక్కువే. తనపై 19 కేసులు ఉన్నాయని.. వాటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్టు అఫిడవిట్‌లో మెన్షన్ చేశారు.

అయితే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలిపిన వివరాలతో పోలిస్తే.. ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ ఏకంగా 67 శాతానికిపైగా పెరగడం విశేషం. అందుకే అంటారు డీకేనా మజాకా. ఈసారి కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యతో పోటీపడుతున్నారు శివకుమార్.

ఇక, డీకే శివకుమార్ కంటే కూడా బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ్ మరింత ఆస్తిపరుడిగా నిలిచాడు. ఆ బీజేపీ నేత ఆస్తుల విలువ.. రూ.1,607 కోట్లు అని అఫిడవిట్‌లో తెలిపాడు. అటు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాజియా తర్రానుమ్.. అందరికంటే ఎక్కువగా రూ.1,629 కోట్లతో టాప్‌లో ఉన్నారు.

మే 10న ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న కౌంటింగ్ అండ్ రిజల్ట్స్.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×