E-Paper
Advertisement

షాబాద్ సైకో కథ ఎండ్.. ఎన్‌కౌంటర్‌లో రాజ్‌కుమార్ హతం? దీనివెనుక అసలు నిజమేంటి?

షాబాద్ సైకో కథ ఎండ్.. ఎన్‌కౌంటర్‌లో రాజ్‌కుమార్ హతం? దీనివెనుక అసలు నిజమేంటి?
Advertisement

Ranga reddy: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది షాబాద్ ఆరుగురి హత్యల కేసు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ మారణ హోమానికి కారణమైన నిందితుడు రాజ్‌కుమార్ పోలీసుల ఎన్ కౌంటర్‌లో మరణించినట్లు వార్తలు జోరందుకున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వార్తల్లో నిజమందా? అన్నదే అసలు పాయింట్.

షాబాద్ సైకో కథ ఎండ్-రంగారెడ్డి జిల్లా మల్కారం గ్రామం సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఈ ఘటన జరిగినట్లు ఆ వార్తల వెనుక అసలు సారాంశం. ఘటన జరిగిన తర్వాత పోలీసులు గాలింపు చేపట్టారని, లొంగిపోవాలని హెచ్చరించారట. ఐనప్పటికీ నిందితుడు ఎదురుదాడి దిగినట్టు తెలుస్తోంది.

Advertisement

ఎన్‌కౌంటర్‌లో రాజ్‌కుమార్ హతం? ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపినట్టు వార్తలు లేకపోలేదు.  హత్యలు చేసిన తర్వాత రాజకుమార్ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మల్కారం పరిసర ప్రాంతాల్లో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు.

సోషల్ మీడియా వార్తలపై పోలీసులు సైలెంట్-నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. దీంతో రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వార్తలు లేకపోలేదు. దీనిపై పోలీసులు ఇప్పటివరకు నోరు మెదపలేదు.  నిందితుడు కోసం గాలింపు చేపట్టామని పోలీసు అధికారులు ఇదివరకు తెలిపారు.

Advertisement

మరి ఈ ఎన్ కౌంటర్ నిజమెంత? పోలీసులు నోరు విప్పితే అసలు నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు.  ఆరుగుర్ని చంపిన  తర్వాత నేరుగా పోలీసుల ముందు లొంగిపోయేవాడని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ జైలు జీవితం గడిపిన వాడికి ఉందని, ఈ విషయంలో భయం ఉండదని అంటున్నారు. జైలులో ఉంటే వాడి ముఖం ఎవరికీ తెలీదని అంటున్నారు.

ALSO READ: రైతు డిస్కంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బావుల వద్ద కరెంట్ మీటర్లపై కీలక ప్రకటన!

కావాలనే ఎవరో ఆ తరహా వార్తలను సర్య్కూలేట్ చేస్తున్నారని అంటున్నవాళ్లు లేకపోలేదు. శుక్రవారం  రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల గూడలో ఘటన జరిగింది.  కేవలం రెండు గంటల్లో ఆరుగున్ని అత్యంత దారుణంగా ఊచకోత కోశాడు రాజ్‌కుమార్.  వాడ్ని తమకు అప్పగించాలని బాధిత బంధువులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×