E-Paper
Advertisement

Mahesh Kumar Goud: ఈ 28న గాంధీ చిత్రపటాలతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: ఈ 28న గాంధీ చిత్రపటాలతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు: మహేష్ కుమార్ గౌడ్
Advertisement

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని.. దీనికి నిరసనగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించాలని ఏఐసీసీ (AICC) ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో నిరసనలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

ఎన్నో పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం ఉపాధి హామీ. గ్రామీణ ప్రాంత పేదలకు, కూలీలకు ఈ పథకం ఒక భరోసాగా నిలుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందని, నిధుల కోత విధిస్తూ పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ అవలంబిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆయన కోరారు.

ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గాంధీ విగ్రహాల వద్ద లేదా గాంధీ చిత్రపటాలను చేతబూని నిరసనలు తెలియజేయాలని ఆయన సూచించారు. ‘కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయం, పనికి ఇచ్చే గౌరవం. ఈ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలి’ అని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

ALSO READ: Phone Tapping case: ముగిసిన ఆరా మస్తాన్ విచారణ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×