E-Paper
Advertisement

Ponguleti : కాంగ్రెస్ సభకు ఆటంకాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి ఫైర్..

Ponguleti : కాంగ్రెస్ సభకు ఆటంకాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి ఫైర్..
Advertisement

Ponguleti : ఖమ్మం సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి విమర్శించారు. రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

ఖమ్మం సభకు జనం భారీగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 15 వేల వాహనాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అయితే రాత్రి నుంచి 1700 వాహనాలు సీజ్ చేశారని చెప్పారు. ప్రైవేట్ వాహనాలలో జనం రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే కాంగ్రెస్ సభను సక్సెస్ కాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అయినా సరే బీఆర్ఎస్ సభను తలదన్నేలా కాంగ్రెస్ జనగర్జన సభ నిర్వహిస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లక్షల మందివస్తారని పేర్కొన్నారు.

Advertisement

సభకు వెళితే సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రజలను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. రైతు బంధు ఆపేస్తామని రైతులను భయపెడుతున్నారని మండిపడ్డారు. పోడు భూములు పట్టాలు ఇస్తామని గిరిజనులను ప్రలోభపెడుతున్నారని తెలిపారు. కేసీఆర్ పతనం ఖమ్మం సభ నుంచే మొదలవుతుందని పొంగులేటి స్పష్టం చేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×