E-Paper
Advertisement

పెద్దపల్లికి గుడ్‌న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!

పెద్దపల్లికి గుడ్‌న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!
Advertisement

Peddapalli Bus Depot: పెద్దపల్లి జిల్లాలో రవాణా సౌకర్యాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ డిపో నిర్మాణ పనులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు.

డిపో పనుల పురోగతిని సమీక్షిస్తూ.. నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సహచర మంత్రి శ్రీధర్ బాబు అందించిన వివరాల మేరకు పనులు త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి బస్ డిపో నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.

Advertisement

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కోట్ల రూపాయల బస్సు ఛార్జీలను భరించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

Also Read: “నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కలకలం

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×