E-Paper
Advertisement

Munugode : మునుగోడులో గెలిచేదెవరు?.. మేమంటే మేము..

Munugode : మునుగోడులో గెలిచేదెవరు?.. మేమంటే మేము..
Advertisement

Munugode : మునుగోడు మహా సంగ్రామం ముగిసింది. ఓటరు మనోగతం ఈవీఎంలతో నిక్షిప్తమైంది. గెలిచేదెవరో ఆదివారం తేలిపోనుంది. అప్పటి వరకూ ఎవరి ధీమా వారిదే. విజయం మాదంటే మాదంటూ అన్ని పార్టీలు గాంభీర్యానికి పోతున్నాయి. లోలోన మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు నేతలు.

మునుగోడు పోలింగ్ సరళిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలో పోలింగ్ సరళిని ఎంక్వైరీ చేశారు. మునుగోడులో అనుసరించిన వ్యూహం మంచి ఫలితాన్ని ఇవ్వబోతోందని.. సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని.. ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. రెండు నెలలుగా మునుగోడులో పని చేసిన పార్టీ నేతలందరినీ అభినందించారు.

Advertisement

మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తమ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డినే గెలవబోతున్నట్టు ప్రకటించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేశారంటూ ఓటర్లందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎదుర్కొని పోరాటం చేసిన బీజేపీ శ్రేణులను బండి అభినందించారు. ఎన్నికల సంఘం, పోలీసులు అంతా అధికార పార్టీకి కొమ్ము కాసారని.. అయినా విజయం తమదేనని ధీమాగా చెప్పారు బండి సంజయ్.

అటు, కాంగ్రెస్ సైతం మునుగోడులో గెలిచేది తామేనంటూ బలంగా చెబుతుండటం ఆసక్తికరం.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×