E-Paper
Advertisement
గద్వాల్లో బెల్ట్ షాపుల జోరు యువత బేజారు.. పట్టించుకోని అధికారులు
నర్సింహులపేటలో దారుణం.. గ్యాస్ కొరతతో ప్రజల తీవ్ర ఆందోళన!
తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. వెంటనే కారు ఆపి..? మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. వెంటనే కారు ఆపి..? మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆమె.. తాజాగా రోడ్డు ప్రమాద బాధితుల పట్ల కన్నతల్లిలా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన మంత్రి.. వెంటనే తన ప్రయాణాన్ని ఆపి బాధితులకు అవసరమైన సాయం అందించారు. బీబీనగర్ శివారులో ఒక దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదం […]

ధాన్యం కొనరా.. రైతులను ముంచేస్తారా? రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్
మూడు ముక్కల జీహెచ్ఎంసీతో ముప్పు తిప్పలు పడుతున్న జనం.. వెలుగులోకి విచిత్ర పరిస్థితులు..!
ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌కి సర్కార్ మోక్షం.. ఆ తేదీలోపు చెల్లిస్తే భారీ డిస్కౌంట్..!

ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌కి సర్కార్ మోక్షం.. ఆ తేదీలోపు చెల్లిస్తే భారీ డిస్కౌంట్..!

LRS Scheme: స్వేచ్ఛ బ్యూరో: ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల క్లియరెన్స్ కు 25 శాతం రాయితీ ఇస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేయటంతో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ దరఖాస్తుల క్లియరెన్స్‌తో నిధులు సమకూర్చుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన- అభివృద్ది ప్రణాళికలో భాగంగా 99 డేస్ కార్యచరణలో భాగంగా ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని జీహెచ్ఎంసీ […]

నో బిన్.. నో బిజినెస్: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన కీలక ప్రకటన
భానుడి భగభగలకు చెక్.. రెండ్రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో పిడుగుల వాన..!
విద్యాశాఖను అందుకోసమే మీ దగ్గర పెట్టుకున్నారా..? సీఎంకు కేటీఆర్ సంచలన లేఖ
మోడి పర్యటన వేళ బీజేపీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాలో విపక్షాలపై డిజిటల్ దండయాత్ర!

మోడి పర్యటన వేళ బీజేపీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాలో విపక్షాలపై డిజిటల్ దండయాత్ర!

BJP Campaign: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో సమరానికి సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ కేడర్‌కు అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని, విపక్షాలే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడాలని టీబీజేపీ నిర్ణయించింది. తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సరికొత్త యుద్ధానికి భారతీయ జనతా పార్టీ తెరలేపింది. విమర్శల పదును పెంచాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై సోషల్ మీడియా వార్ షురూ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో […]

కరీంనగర్ జ్యువెలరీ షాప్ ఘటన.. ఇది మామూలు ప్లాన్ కాదు,  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే?

కరీంనగర్ జ్యువెలరీ షాప్ ఘటన.. ఇది మామూలు ప్లాన్ కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే?

కరీంనగర్ నగరంలో ఆదివారం నాడు అత్యంత సాహసోపేతమైన సంచలన దోపిడీ చోటుచేసుకుంది. పట్టపగలు నగర నడిబొడ్డున ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడ్డ దుండగులు తుపాకులతో హల్చల్ చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలతో ఉడాయించారు. ఈ ఘోర దురాగతం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హుటాహుటిన జ్యువెలరీ షాపునకు చేరుకున్నారు. అక్కడ జరిగిన పరిస్థితిని క్షుణ్ణంగా […]

తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్.. ఏఐసీసీ వ్యూహత్మక అడుగు..!
చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

Telangana Forts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని చారిత్రక సంపదకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. శిథిలావస్థకు చేరుతున్న కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా అటు వారసత్వాన్ని కాపాడటంతో పాటు, ఇటు రాబడిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో 11 కోటలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన కోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం […]

Big Stories

Advertisement
×