E-Paper
Advertisement

Murder : రెచ్చిపోయిన సైకోలు .. సాయం చేసిన పాపానికి యువకుడు బలి..

Murder : రెచ్చిపోయిన సైకోలు .. సాయం చేసిన పాపానికి యువకుడు బలి..
Advertisement

Murder : సొసైటీలో సైకోలు చెలరేగిపోతున్నారు. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. వారి ఉన్మాదాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్‌ శివారు నార్సింగ్ లో ఒక యువకుడి ప్రాణాలు తీశారు.

ఏం జరిగిందంటే..?
సోమవారం అర్ధరాత్రి నార్సింగి సమీపంలోని జన్వాడలో ఓ పెట్రోల్‌ బంకు వద్దకు కారు వచ్చి ఆగింది. కారులో పెట్రోల్‌ పోయాలని అందులోని యువకులు కోరారు. బంకు మూసి వేశామని అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పారు. కారులో పెట్రోల్ అయిపోయిందని చాలా దూరం వెళ్లాలని కారులో ఉన్న ముగ్గురు యువకులు వేడుకున్నారు. దీంతో పెట్రోల్ బంకు సిబ్బంది కనికరించారు. కారులో పెట్రోల్ నింపారు.

Advertisement

కారులో పెట్రోలు నింపుకున్న తర్వాత ఆ ముగ్గురు యువకుల అసలు రూపం బయటపడింది. బిల్లు చెల్లింపు చేసే సమయంలో కారులోని యువకులు తమ కార్డును ఇచ్చారు. స్వైప్‌ మెషిన్‌ లేదని.. నగదు ఇవ్వాలని పెట్రోల్ బంకు క్యాషియర్‌ కోరారు. దీంతో కారులోని యువకులు క్యాషియర్ తో గొడవకు దిగారు. అతడిపై దాడికి తెగబడ్డారు. క్యాషియర్‌ను కొట్టొద్దంటూ పెట్రోల్ బంకులో పనిచేసే సంజయ్‌ అనే యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో సంజయ్‌పైనా దాడి చేశారు. ఆ యువకుల దాడిలో తీవ్రంగా గాయపడి సంజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. పెట్రోల్ బంకు సిబ్బంది సంజయ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. పెట్రోల్‌ బంకు సమయం ముగిసినా కారులో పెట్రోల్ పోసి చేసిన సాయమే ఆ యువకుడి ప్రాణాలను తీసింది.

పెట్రోల్‌ కోసం కారులో వచ్చిన యువకులు ఘటనా స్థలి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్‌, మల్లేశ్‌, అనూప్‌లుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజా వద్ద తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మద్యం, గంజాయి మత్తులో సైకోలు రెచ్చిపోతున్నారు. అక్కడ పనిచేసే సిబ్బందిపై దాడులకు తెగబడి ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి దుర్మాగుల ఆగడాలు ఆగేదెలా..?

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×