E-Paper
Advertisement

Moinabad Farm House Case : ఆ ముగ్గురిపై కేసులివే

Moinabad Farm House Case : ఆ ముగ్గురిపై కేసులివే
Advertisement

Moinabad Farm House Case : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు ముడుపుల ఇవ్వజూపిన వ్యవహారంలో ఆ ముగ్గురి నిందితులపై 120 B,171 B,రెడ్ విత్ 171 E,506,రెడ్ విత్ ఐపీసీ 34, యాక్ట్ సెక్షన్ 8 కింద కేసులు నమోదు చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎప్పటి నుంచి సంప్రదింపులు జరిపారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. మొయినాబాద్ ఫాంహౌస్ లోని సీసీటీవీ ఫుటీజీని పరిశీలిస్తున్నారు.

ఎఫ్ఐఆర్ లో ఉన్న కీలకాంశాలు ఇవే

Advertisement

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. బీజేపీలో చేరితే రూ. 100 కోట్లు ఇప్పిస్తామని రామచంద్ర భారతి ఆఫర్ చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే ఆ డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని మధ్యవర్తులు ఆఫర్ చేసినట్లు తెలిపారు. తనతోపాటు బీజేపీలో చేరే వారికి రూ. 50 కోట్లు ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రామచంద్ర భారతి, నందకుమార్ బీజేపీకి చెందిన వ్యక్తులుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రోహిత్ రెడ్డి వివరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలనే ఎఫ్ఐఆర్ లో పొందుపర్చారు పోలీసులు. ఇప్పుడు ఇదే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలనే కుట్ర వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే విషయంపై దృష్టి పెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×