E-Paper
Advertisement

Electric Buses: టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

Electric Buses: టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
Advertisement

సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ ఆర్టీసీ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి నేటితో 2 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు సుమారు 8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారని వెల్లడించారు. ఈ పథకంతో హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ఉద్యోగాలకు మహిళల ప్రయాణం పెరిగిందని చెప్పారు.

ప్రస్తుతం కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారా ఆర్టీసీలోకి కొత్త జోష్ వస్తుందన్నారు మంత్రి పొన్నం. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని చెప్పారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ, స్క్రాప్ పాలసీలు తీసుకొచ్చామని, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×