E-Paper
Advertisement

Jupally Krishna Rao: రైతులకు న్యాయమైన ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao: రైతులకు న్యాయమైన ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
Advertisement

Jupally Krishna Rao:  స్వేచ్ఛ, బ్యూరో:  రైతులకు న్యాయమైన ధర కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. కొల్లాపూర్ మండలం కొప్పునూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,875కు కొనుగోలు చేస్తామని తెలిపారు.

Also Read: EV Summer Tips: సమ్మర్ లో ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? ఏసీ విషయం లో జాగ్రత్త!

రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి 

Advertisement

కొనుగోలు ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యమని, శనగలో తేమ శాతం 14 శాతం లోపే ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, మార్క్‌ఫెడ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ban On SRH: స‌న్ రైజ‌ర్స్ టికెట్ కొంటే, పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషించిన‌ట్లే !

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×