E-Paper
Advertisement

Jagtial News: బతికుండగానే రూ.12 లక్షలతో సమాధి నిర్మించుకున్న వ్యక్తి

Jagtial News: బతికుండగానే రూ.12 లక్షలతో సమాధి నిర్మించుకున్న వ్యక్తి
Advertisement

Jagtial News: మరణం అనేది ఎవరికైనా భయాన్నే కలిగించే అంశం. అయితే కొందరు మాత్రం దాన్ని సహజంగా స్వీకరించి, జీవితం ఉన్నప్పుడే మరణానికి సిద్ధమవుతారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన నక్క ఇంద్రయ్య (80) అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు. బతికుండగానే తన కోసం రూ.12 లక్షల వ్యయంతో సమాధిని నిర్మించుకున్నాడు.

నక్క ఇంద్రయ్య భార్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకాలతోనే రోజులు గడుపుతున్నారు. చివరకు తన భార్య సమాధి పక్కనే తనకు కూడా సమాధి ఉండాలన్న కోరిక ఆయన మనసులో బలంగా నాటుకుంది.

Advertisement

ఈ ఆలోచనను మాటలకే పరిమితం చేయకుండా, కార్యరూపంలోకి తీసుకొచ్చారు. తన పొదుపు మొత్తాన్ని ఉపయోగించి, దాదాపు రూ.12 లక్షల వ్యయంతో తన సమాధిని ముందుగానే నిర్మించుకున్నారు. రాయి పనితో శిల్పకళను తలపించేలా, సక్రమంగా నిర్మించిన ఈ సమాధి ఇప్పుడు లక్ష్మీపురం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

మరణం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అది వచ్చినప్పుడు భయం లేకుండా స్వీకరించాలి. అందుకే ముందే సిద్ధమయ్యాను అని ఆయన చెబుతారు. జీవితం తాత్కాలికమేనని, శాశ్వతం ఏదీ కాదన్న సత్యాన్ని ప్రతిరోజూ తనకు తానే గుర్తుచేసుకునేందుకు ఈ సమాధి ఉపయోగపడుతుందని అంటున్నారు.

Advertisement

ప్రస్తుతం ఆయన రోజూ ఉదయం, సాయంత్రం తన సమాధి వద్దకు వెళ్లి కొద్దిసేపు కూర్చుంటారు. అక్కడే ప్రశాంతంగా ధ్యానం చేస్తూ, తన గత జీవితాన్ని గుర్తుచేసుకుంటారు. భార్యతో గడిపిన రోజులు, కుటుంబ బాధ్యతలు, కష్టసుఖాలు అన్నీ ఆ సమాధి వద్ద ఆయన మనసులో తిరుగుతుంటాయి. కొందరికి ఇది వింతగా అనిపించినా, ఇంద్రయ్యకు మాత్రం అది మనశ్శాంతిని ఇస్తోంది.

Also Read: తొలి సంతకం ఆడపిల్లల భవిష్యత్తుకే.. నూతన సర్పంచ్ వినూత్న పాలనకు శ్రీకారం

గ్రామస్తులు మొదట ఈ విషయాన్ని ఆశ్చర్యంతోనే చూశారు. బతికుండగానే సమాధి ఎందుకు? అంటూ పలువురు ప్రశ్నించారు. కానీ కాలక్రమేణా ఇంద్రయ్య ఆలోచన వెనక ఉన్న తాత్వికతను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది ఆయనను గౌరవంతో చూస్తున్నారు. జీవితం పట్ల, మరణం పట్ల ఇంత స్పష్టమైన అవగాహన ఉండటం అరుదని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×