E-Paper
Advertisement

Mahabubabad Municipal: కొత్తగూడెం నగరపాలక సంస్థలు రసవత్తరంగా రాజకీయం.. ఆ 10 సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ!

Mahabubabad Municipal: కొత్తగూడెం నగరపాలక సంస్థలు రసవత్తరంగా రాజకీయం.. ఆ 10  సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ!
Advertisement

Mahabubabad Municipal: మహబూబాబాద్ స్వేచ్ఛ:  నూతనంగా నగరపాలక సంస్థగా ఏర్పడిన కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ చేసిన సిపిఐ, కాంగ్రెస్ ( Congress)  పార్టీలు నేడు మేయర్ పీఠం కోసం కుస్తీ పడుతున్నాయి. స్థానికంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మేయర్ పీఠం కోసం పావులు కదుపుతున్నాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అత్యధికంగా పాల్వంచలో ఉండడంతో సిపిఐ కి లాబించే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ సైతం సిపిఐ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అక్కడి స్థానికులు చర్చించుకోవడం గమనార్హం.

Also  Read: BRS: పురపోరు ఖర్చు ఇన్‌ఛార్జీలదే.. తేల్చిచెప్పిన బీఆర్ఎస్ పార్టీ.. భవిష్యత్ లో ఆ నేతల భవిష్యత్ కష్టమే?

ఆరుగురిని సిపిఐ పార్టీ ఏకగ్రీవం

Advertisement

సిపిఐ కి 20 కి పైగా, కాంగ్రెస్ కి 20 కి పైగా, బీఆర్ఎస్, (Brs)  ఇండిపెండెంట్ లకు చేరో ఐదు చొప్పున కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 60 డివిజన్లకు గానూ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న సిపిఐ పార్టీకి 20 స్థానాలకు పైగా, అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కి 5, 98 మంది ఇండిపెండెంట్ లుగా నిలబడ్డప్పటికీ అందులో ఐదుగురిని మాత్రం ప్రజలు గెలిపిస్తారని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీలు గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అత్యధికంగా సిపిఐ పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిచారని ప్రచారం జరుగుతుంది. అందులో ఆరుగురిని సిపిఐ పార్టీ ఏకగ్రీవం చేసుకోగలిగిందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిపిఐ తో జతకట్టకపోవడంతో ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి లాబిస్తుందని అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లోను కొనసాగుతుందని కొత్తగూడెం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

మరో 10 సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీ కుస్తీ

కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు సమాన స్థానాలు గెలుచుకుంటాయని అక్కడి ప్రజలు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు అయిదు చొప్పున గెలుచుకోగలిగితే మిగిలే పది స్థానాలకు కాంగ్రెస్, సీపీఐ పార్టీ కుస్తీ పట్టాల్సి వస్తుంది. ఈ పది స్థానాల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితే ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కే అధిక అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ పది స్థానాల్లో మరిన్ని సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే సిపిఐ పార్టీ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్, ఇంటిపెండెంట్ లపై ఆధారపడి పీఠం చేసికించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

Advertisement

Also  Read:Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలు.. ఉపసంహరణకు చివరి ఛాన్స్, ఇకపై ఏకగ్రీవాలు షురూ! 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×