E-Paper
Advertisement

MallaReddy: 30 కోట్ల భూమి భూంఫట్!.. మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణలు

MallaReddy: 30 కోట్ల భూమి భూంఫట్!.. మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణలు
Advertisement
mallareddy

MallaReddy: మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. 30 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు మంత్రి మల్లారెడ్డి, ఆయన బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి కుట్ర చేశారంటూ మర్రి వెంకట్‌రెడ్డి, దయాసాగర్‌ రెడ్డి మీడియాను ఆశ్రయించారు. మంత్రి పలుకుబడితో పోలీసులు కేసు తీసుకోవడం లేదన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన వర్గం నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ వాపోయారు.

మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో మంత్రి మల్లారెడ్డి కాలేజ్ ఎదురుగా ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. సుంకరి కుటుంబం నుండి తాము కొన్నామని మర్రి వెంకట్‌రెడ్డి, దయాసాగర్ రెడ్డి చెప్తున్నారు. సుంకరి కుటుంబానికి చెందిన 8 ఎకరాల్లో 4.5 ఎకరాలు కొనుగోలు చేశామంటూ డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి తన భార్య కల్పన పేరు మీద ఆ 8 ఎకరాల్లోని 2 ఎకరాలు కొన్నారని చెప్తున్నారు. కేవలం రెండు ఎకరాలు మాత్రమే కొని.. భూమి మొత్తాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేశారని బాధితులు అంటున్నారు. తాము కొన్న భూమి దగ్గరకు కూడా రానివ్వకుండా మంత్రి, ఆయన అనుచరులు దాడి చేశారని.. మంత్రి బావమరిది శ్రీనివాస్ రెడ్డి కాల్చివేస్తానంటూ గన్ గురి పెట్టారని ఆరోపించారు.

Advertisement

మంత్రి మల్లారెడ్డి, ఆయన బావమరిది శ్రీనివాస్‌రెడ్డి, వాళ్ల అనుచరుల దౌర్జన్యాలపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని మర్రి వెంకట్‌రెడ్డి, దయాసాగర్‌ రెడ్డి చెప్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిడి ఉందంటూ తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధరణి డాక్యుమెంట్లు చూపించినా పట్టించుకోవడం లేదన్నారు. చాలామంది రైతులను మంత్రి మల్లారెడ్డి మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×