E-Paper
Advertisement

Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం.. పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే

Hyderabad News: కోర్టుకి చేరిన హిల్ట్ పాలసీ వ్యవహారం..  పిటిషన్ వేసిన కేఏ పాల్, విచారణ ఎప్పుడంటే
Advertisement

Hyderabad News: హిల్ట్‌ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని ప్రస్తావించారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది న్యాయస్థానం.

తెలంగాణలో రాజకీయాలు కొన్నిరోజులుగా హిల్ట్ పాలసీ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు ప్రజాశాంతి చీప్ కేఏ పాల్. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకో కీలక విషయాలు ప్రస్తావించారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం చేసిన 9,292 ఎకరాల భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోరారు. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది న్యాయస్థానం. పాల్‌తో పాటు మరో రిటైర్డ్ ప్రొఫెసర్ పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణలో ఉన్న భూములకు కంపెనీలు పెట్టడం లేదని, యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు వివరించారు. ఆయా భూములు ఎవరికి అమ్మకుండా స్టే ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఇలాంటి విలువైన భూములు దుర్వినియోగం చేస్తే వాటిపై కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యాపారవేత్తలతో అగ్రిమెంట్లు చేసినా అవి నిలబడవని అన్నారు.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×