E-Paper
Advertisement

Jagguswamy : హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్.. ఆ నోటీసులపై స్టే ఇవ్వాలని వినతి..

Jagguswamy : హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్.. ఆ నోటీసులపై స్టే ఇవ్వాలని వినతి..
Advertisement

Jagguswamy : ఎమ్మెల్యేలకు ఎర కేసులో తనను అక్రమంగా ఇరికించారని హైకోర్టులో కేరళకు చెందిన జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ వేశారు. తనకు సిట్‌ జారీ చేసిన 41-ఏ సీఆర్‌పీసీ, లుకౌట్‌ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టులో ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. జగ్గుస్వామికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించింది. తుషార్, రామచంద్రభారతికి జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Advertisement

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ ప్రయత్నించారని అభియోగాలున్నాయి. ఈ కేసులో జగ్గుస్వామి ప్రమేయం ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే జగ్గుస్వామికి సిట్ 41-ఏ సీఆర్ పీసీ నోటీసులు ఇచ్చింది. జగ్గుస్వామి విచారణకు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో జగ్గుస్వామి ఈ రెండు నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×