E-Paper
Advertisement

Thamilasai : రాజ్ భవన్ Vs ప్రగతి భవన్..మరోసారి అగ్గిరాజేసిన ప్రోటోకాల్ వివాదం..

Thamilasai : రాజ్ భవన్ Vs ప్రగతి భవన్..మరోసారి అగ్గిరాజేసిన ప్రోటోకాల్ వివాదం..
Advertisement

Thamilasai : తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య మరోసారి ప్రోటోకాల్ వివాదం రేగింది. గవర్నర్ తమిళిసై సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి దర్శనం కోసం వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర ఉన్నతాధికారులెవరూ హాజరుకాకపోవడం మరోసారి వివాదానికి దారి తీసింది. గవర్నర్ ప్రోటోకాల్ అంశం చర్చనీయాంశంగా మారింది.

మల్లికార్జునస్వామి దర్శనం తర్వాత తమిళిసై మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ వివాదంపై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కొమురవెల్లికి రైల్వే స్టేషన్ కావాలని భక్తులు కోరారని తెలిపారు.
వీలైనంత త్వరగా కొమురవెల్లికి రైల్వేస్టేషన్ వచ్చేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

ఇప్పటికే అనేకసార్లు గవర్నర్ తమిళిసై టూర్‌లో ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది. కొంతకాలంగా గవర్నర్ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కావడం లేదు. తన పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ కూడా గతంలో బహిరంగంగా ప్రకటించారు. తమిళ సై యాదాద్రి, భదాద్రి పర్యటనల సమయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది.

మరోవైపు గవర్నర్ పై టీఆర్ఎస్ నేతలేకాకుండా ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా తమిళిసై పై సీపీఐ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బిల్లులు ఎక్కవ కాలం పెండింగ్‌లో పెట్టే హక్కు గవర్నర్‌కు లేదని స్పష్టం చేశారు. బిల్లులపై మంత్రులు గవర్నర్ వద్దకు వెళ్లి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గవర్నర్‌కు ఏమైనా అంశాలపై అనుమానం ఉంటే అధికారులతో మాట్లాడాలని సూచించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈ వ్యవస్థతో కేంద్రం రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×