E-Paper
Advertisement

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా..  ఉన్నదంతా బయటపెడ్తా..  సిట్ విచారణకు ముందు  బండి షాకింగ్ కామెంట్స్
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పటికే ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు బయల్దేరారు. తన దగ్గరున్న ఆధారాలన్నింటిని అధికారులకు సమర్పిస్తానన్నారు బండి సంజయ్. తనకు సిట్ విచారణపై నమ్మకం లేదని.. కానీ తన దగ్గరున్న ఆధారాలు ఇస్తానని తెలిపారు. ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద నమ్మకం లేదు
గత ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్‌నే ఎక్కువ సార్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా బండి ఫోన్ కాల్స్ టాప్ చేసినట్లు తెలిపారు. మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయట పెట్టింది కూడా నేనే అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు, ఇలా కేసిఆర్ గారి ప్రభుత్వం అన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయని తెలిపారు. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు.. సిట్ మీద కూడా నమ్మకం లేదన్నారు. అధికారులు మంచివాళ్లే గాని అధికారులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్రీగా వర్క్ చేసుకోనివట్లేదన్నారు. కమిషన్‌ల పేరుతో కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్ట‌ చేయలేదని మండిపడ్డారు.

Advertisement

Also Read: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

దీనికి సంబంధించిన ఆధారాలను కేంద్ర నిఘా వర్గాలు కేంద్రమంత్రి బండి సంజయ్ ముందుంచాయి. ఈ మేరకు నిన్న హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై వారితో బండి సంజయ్ చర్చించారు. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది. SIB, సిట్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులతో బండి సంజయ్‌ ప్రత్యేకంగా చర్చించారు.

Advertisement

మరికాసేపట్లో SIT ముందుకు కేంద్రమంత్రి బండి సంజయ్
గత నెల 24న విచారణకు హాజరుకావాలని బండి సంజయ్‌కి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే పార్లమెంట్‌ సమావేశాల కారణంగా హాజరుకాలేనని తెలిపారు. కాగా మరోసారి ఈ నెల 8న హాజరు కావాలని అధికారులు సూచించడంతో నేడు ఆయన సిట్‌ ముందుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరవుతారు. తన వద్ద ఉన్న అన్ని రకాల ఆధారాలను సిట్‌‌కు అందజేస్తారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×