E-Paper
Advertisement

బిల్డింగ్ పర్మిషన్‌కు రూ.లక్ష లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ లేడీ ఆఫీసర్.. ఎక్క‌డంటే?

బిల్డింగ్ పర్మిషన్‌కు రూ.లక్ష లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ  జీహెచ్ఎంసీ లేడీ ఆఫీసర్.. ఎక్క‌డంటే?
Advertisement

GHMC Bribe: రాజధాని హైదరాబాద్‌లో అవినీతి తిమింగలాలు రోజురోజుకూ రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం జరుగుతున్న అక్రమాలు, లంచాల డిమాండ్లు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, బోరబండ సర్కిల్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం నగరంలో సంచలనం సృష్టించింది. తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఆమెను ఆశ్రయించిన బాధితుడిని వేధించి, చివరకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది.

రూ. 5 లక్షల డిమాండ్.. అడ్వాన్స్‌గా లక్ష
బోరబండ ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీ బోరబండ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించాడు. అయితే, ఈ ఫైల్ క్లియర్ చేయడానికి టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత ఏకంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ముందుగా అడ్వాన్స్ కింద రూ. లక్ష ఇవ్వాలని బాధితుడిని తీవ్రంగా ఒత్తిడి చేసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని వెంకటేష్, అధికారుల వేధింపులను భరించలేక ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులను ఆశ్రయించి తన బాధను చెప్పుకున్నాడు.

Advertisement

ఏసీబీ పక్కా ప్లాన్.. రెడ్‌హ్యాండెడ్ పట్టివేత
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పక్కా పథకం రచించారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, యూసుఫ్‌గూడ ప్రాంతంలో శ్రీలత బాధితుడి నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నారు. ఆమె చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించి, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆకస్మిక దాడితో టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతికి పాల్పడుతున్న ఇతర సిబ్బంది కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Also Read: భారీ అగ్నిప్రమాదం.. నిజాంపేట్‌లో బూడిదైన 6 ఫర్నిచర్ దుకాణాలు.. షార్ట్ సర్క్యూట్ కారణమా?

Advertisement

సామాన్యులకు భరోసా.. కఠిన చర్యల దిశగా..
జీహెచ్‌ఎంసీలో ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారుల పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చట్టబద్ధమైన అనుమతుల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టి, అడ్డగోలుగా లంచాలు వసూలు చేసే వారికి ఈ సంఘటన ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తుంది. ఏసీబీ అధికారులు ఇలాంటి అవినీతి తిమింగలాలపై నిఘా పెంచాలని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి అవినీతి అధికారుల సమాచారాన్ని ఏసీబీకి అందించాలని సూచిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×