E-Paper
Advertisement

Bandi Sanjay : బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.. షరతులివే?

Bandi Sanjay : బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.. షరతులివే?
Advertisement

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతించింది. నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి యాత్ర చేపట్టేందుకు సంజయ్‌ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

హైకోర్టు షరతులివే

Advertisement

యాత్ర ప్రారంభం సందర్భంగా బీజేపీ నిర్వహించే సభ భైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటేనే అనుమతించాలని పోలీసులకు స్పష్టం చేసింది. 3 వేల మందితోనే సభ నిర్వహించాలని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే సభ నిర్వహించుకోవాలని సూచించింది. పాదయాత్ర నిర్మల్ మీదుగా కొనసాగించాలని ఆదేశించింది. 500తోనే యాత్ర సాగించాలని హైకోర్టు ఆదేశించింది. కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు పట్టు కెళ్లకూడదని నిర్దేశించింది. అయితే హైకోర్టు షరతుల తర్వాతా బీజేపీ నేతలు తమ కార్యక్రమాలు మంగళవారానికి వాయిదా వేశారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. భైంసా పట్టణం మీదుగా పాదయాత్ర వెళ్లదని తెలుపుతూ రూట్‌మ్యాప్‌ వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు. పట్టణంలోని ప్రవేశించకుండా వై జంక్షన్‌ నుంచి మాత్రమే కొనసాగుతుందని వివరించారు. భైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లనప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వివరణ ఇచ్చారు. ఆ ప్రాంతం చాలా సున్నితమైందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సంజయ్‌ పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

మరోవైపు బైంసాలోని ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభా స్థలి వద్ద ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ వద్ద బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. రెండురోజులపాటు బైంసాలో 144 సెక్షన్‌ విధించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×