E-Paper
Advertisement

Diwali Eye effected: దీపావళి టపాసుల ఎఫెక్ట్.. కంటి సమస్యలతో సరోజినీ దేవి ఆసుపత్రికి బాధితులు క్యూ

Diwali Eye effected: దీపావళి టపాసుల ఎఫెక్ట్.. కంటి సమస్యలతో సరోజినీ దేవి ఆసుపత్రికి బాధితులు క్యూ
Advertisement

Diwali Eye effected: హైదరాబాద్ లో దీపావళి పండుగ నాడు టపాసులు పేల్చే సమయంలో ప్రమాదవశాత్తు అనేక మందికి కంటి గాయాలు అయ్యాయి. కంటి గాయాలైన వారు మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూకట్టారు. 20 మంది పిల్లలు సహా మొత్తం 54 మంది కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించారు.

పటాకుల కారణంగానే

దీపావళి పండుగ సందర్భంగా గత మూడు రోజుల్లో కంటి గాయాలతో పదుల సంఖ్యలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ మందికి అధిక డెసిబెల్ మిర్చి బాంబుల కారణంగా గాయాలు సంభవించాయి. దాదాపు 80% కేసులు పటాకుల కారణంగా ఏర్పడినవే ఉన్నాయి. పండుగ సమయాల్లో అత్యంత తీవ్రమైన కంటి గాయాలు అవుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

Advertisement

గాయపడిన వారిలో ఎక్కువ మందిని ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించామని వైద్యులు తెలిపారు. తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలు చికిత్స చేస్తున్నామన్నారు. ఏడుగురు వైద్యుల బృందం గాయపడిన వారికి చికిత్స చేస్తున్నారు. కొంతమంది పటాకులు పేల్చేటప్పుడు గాయపడగా, మరికొందరు పటాకులను దగ్గరగా వెలిగించిన క్రాకర్ల వల్ల గాయపడ్డారని వైద్యులు తెలిపారు.

తీవ్రమైన గాయాలు

“గత మూడు రోజులుగా మొత్తం 54 మంది కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చారు. వీటిలో 23 కేసులు తీవ్రమైనవి. 23 మందిలో నలుగురిని ఆసుపత్రిలో చేర్చారు. ముగ్గురిని శస్త్రచికిత్స కోసం తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మళ్లీ దృష్టి వస్తుందో, కోలుకుంటారో లేదో ఈ దశలో మేము చెప్పలేము. విషమంగా ఉన్న ఇద్దరిలో ఒకరు పిల్లవాడు, మరొకరు పెద్దవాడు” అని వైద్యులు అన్నారు.

Advertisement

Also Read: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్ కుమార్! 

గాయపడిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల చెందిన వారే ఉన్నారు. సాధారణంగా దీపావళి మరుసటి రోజు లేదా రెండు రోజుల తరువాత కూడా కంటి సమస్యలతో వస్తారన్నారు. ‘ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 20 మంది పిల్లలు ఉన్నారు. 30 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వారు ఎక్కువగా గాయపడ్డారు’ అని వైద్యులు తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×