E-Paper
Advertisement

Diwali Bonus : దీపావళి బోనస్ రూ.85 వేలు.. 3.50 లక్షల మందికి లబ్ధి..

Diwali Bonus : దీపావళి బోనస్ రూ.85 వేలు.. 3.50 లక్షల మందికి లబ్ధి..
Advertisement

Diwali Bonus : ఏవైనా పండుగల సందర్భంలో పలు కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లు, ఇంక్రిమెంట్లు ఇస్తుంటుంది. ఇటీవల తమిళనాడులో ఒక యజమాని తన కంపెనీ ఉద్యోగులకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను దీపావళి గిఫ్టులుగా ఇచ్చారు. మరొకరు కార్లను గిఫ్టులుగా ఇచ్చారు. తాజాగా.. బొగ్గుగని కార్మికులకు కూడా దీపావళి బోనస్ ఇస్తున్నట్లు కోల్ ఇండియా యాజమాన్యం వెల్లడించింది.

ఒక్కో ఉద్యోగికి రూ.85 వేల చొప్పున ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్ ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున బోనస్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళికి రూ.76,500 బోనస్ చెల్లించగా.. ఈ ఏడాది రూ.1.20 లక్షలు బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టగా.. రూ.8500 పెంచి.. రూ.85000 చెల్లిస్తామని చెప్పింది. కాగా.. పీఎల్ఆర్ బోనస్ ను సింగరేణి కార్మికులకు దీపావళికి 7-10 రోజుల ముందు చెల్లిస్తుండగా.. ఇతర ప్రాంతాల వారికి దసరా ముందు చెల్లిస్తున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×