E-Paper
Advertisement

Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రతికార పాలన నడుస్తుంది: సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రతికార పాలన నడుస్తుంది: సబితా ఇంద్రారెడ్డి
Advertisement

Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ ప్రతికార పాలన నడిపిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సబితా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు గాలికొదిలేసి పాలన సాగిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో పనిచేస్తున్న పోలీసులకు మాజీ సీఎం అడ్రస్​ తెలియదంటే అవమానించడమేనని అన్నారు.

నోటీసులు ఇచ్చి డైవర్షన్..

కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి సంతోషపడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్(KCR)​ పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్​ఎస్​ బయటపెట్టిన ప్రతి సందర్భంలో నోటీసులు ఇచ్చి డైవర్షన్​ చేస్తున్నారని అన్నారు. సీఎంకు ఫోన్​ ట్యాపింగ్​(Phone Tapping) కు సంబంధం ఉండదు.. పోలీస్ డిపార్టెంట్​లోని ఒక వింగ్ పనిచేస్తుందని అన్నారు. కానీ ప్రస్తుత సీఎం కేసీఆర్​కు ఫోన్​ ట్యాపింగ్​తో సంబంధం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్​‌కు నోటీసులకు ఇవ్వడంపై తెలంగాణ సమాజం బాధపడుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. కక్షపూరిత చర్య దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టంగా అర్ధమైతుందన్నారు.

Advertisement

Also Read: Sreeleela: పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు.. శ్రీలీల ఆశ్చర్యకర వ్యాఖ్యలు..!

బోగ్గు కుంభకోణంపై..

హరీష్ రావు(Harish Rao) బోగ్గు కుంభకోణంపై మాట్లాడిన వెంటనే నోటీసులు ఇచ్చారు.. మరుసటి రోజు కేటీఆర్(KTR)​కు ఈవిధంగా ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. విచారణకు సహకారిస్తాను ఎర్రవెల్లికి వచ్చి నోటీసులు ఇవ్వండీ అని మాజీ సీఎం కేసీఆర్​ వివరించారని తెలిపారు. ప్రభుత్వం మాత్రం కావాలనే ఒక రోజు గ్యాప్​తో నోటీస్​ ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్​ సర్వేపై ప్రతి ఒక్కరూ ప్రశంశల జల్లు కురిపిస్తున్నారని మాజీ మంత్రి సబితా అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చిన బీఆర్​ఎస్​ పార్టీని రాజకీయంగా ఎదుర్కొలేరని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే మాజీ సీఎం కేసీఆర్​ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

Advertisement

Also Read: Mahabharata: మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు.. అత్యంత దురదృష్టవంతుడు ఆయనే..! ఎవరో తెలుసా..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×