E-Paper
Advertisement

CM Revanth Reddy : గురువారం ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అజెండా ఇదేనా..?

CM Revanth Reddy : గురువారం ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అజెండా ఇదేనా..?
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం హస్తినలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీకి సైతం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది.

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరగనుంది. జనవరి 7న లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. వారికి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి హాజరు కావాలని ఏఐసీసీ సమాచారం పంపింది. తెలంగాణలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్ల ఈ భేటీకి హాజరవుతారు. వారితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ చర్చించనున్నారు.

Advertisement

తెలంగాణలోని మెజార్టీ లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఉన్నారు. వారితో పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై చర్చించున్నారు. ఐసీసీ కార్యదర్శులు ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ అంశంపైనా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీతో చర్చిస్తారని తెలుస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×