E-Paper
Advertisement

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!
Advertisement

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ న‌గ‌ర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జిల్లాలోని కురుమూర్తి స్వామివారిని దర్శించుకోన్నారు. సీఎం మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకోబోతున్నట్టు సమాచారం. ఆయనతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజన‌ర్సింహ‌, జూపల్లి కృష్ణారావు అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పర్యటనకు వెళుతున్నారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లాలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

పలు రహదారులను దారిని మళ్ళించారు. దీంతో ప్రయాణికులు గమనించాలని ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో రూ.110 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధితో పాటూ వ‌ల‌స‌ల జిల్లా పాల‌మూరును అభివృద్ధి చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల అభివృద్ధిలో పాల‌మూరు వెన‌క‌బ‌డింద‌ని ఆయ‌న‌ అభిప్రాయ‌డ్డారు. ఈ క్ర‌మంలో సొంత జిల్లా అభివృద్ధిపై సీఎం ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఆ దిశ‌గా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. జిల్లా వాసులు సైతం అభివృద్ధిపై ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఐదేళ్ల‌లో రాష్ట్రానికే జిల్లా మోడ‌ల్ కాబోతుంద‌ని ధీమాతో ఉన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×