E-Paper
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
Advertisement

CM Revanth Reddy: అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్య స్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆ దిశగా ఫారిన్ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేలా రాష్ట్ర బ్రాండింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ బ్రాండింగ్ పై మంగళవారం తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఒక్కోరోజు ఒక్కో అంశంపై సీఎం సమీక్ష
వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను పరిశీలించి.. వాటిలో పలు కీలక మార్పులను సూచించారు. ప్రచారంలో ప్రముఖులను హైలైట్ చేయాలి.. తెలంగాణ బ్రాండింగ్ అనేది కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. రాష్ట్ర గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు. చరిత్ర, ప్రకృతి, పర్యావరణం, కళలతోపాటు ప్రముఖులను ప్రచారంలో వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

నేటి నుంచి ఈనెల 30 వరకు సమావేశాలు..
గ్లోబల్ సమిట్ నేపథ్యంలో ఇవాల్టి నుంచి ఈనెల 30వరకు వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించి.. ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నేడు లాజిస్టిక్స్, ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్కతో సీఎం భేటీ కానున్నారు. రేపు మౌలిక వసతులు, అభివృద్ధిపై మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ రైజింగ్ సమిట్‌పై సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం
నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ, యువజన సంక్షేమంపై మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామితో.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు టూరిజంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో సీఎం సమావేశమవుతారు. నవంబర్ 29 సాయంత్రం 4గంటలకు వ్యవసాయంపై మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో.. సాయంత్రం 6 గంటలకు సంక్షేమ విభాగాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, అజారుద్దీన్‌తో రివ్యూ నిర్వహిస్తారు. చివరగా నవంబర్ 30న వైద్యారోగ్య రంగం ఏర్పాట్లపై మంత్రి దామోదర రాజనర్సింహతో సీఎం చర్చించనున్నారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×