E-Paper
Advertisement

Hyderabad : ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రైల్వే లైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Hyderabad : ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రైల్వే లైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Advertisement

Hyderabad news telugu(Telangana today news):దేశంలోనే తొలిసారి తెలంగాణలో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. RRR రోడ్డుకు సమాంతరంగా ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. 320 కిలో మీటర్ల పరిధిలో హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న పలు జిల్లాలను కలుపుకొని నిర్మాణం ఉంటుందని చెప్పారు. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన కొత్త వివాదానికి ఆజ్యం పోసింది.

రీజినల్ రింగ్ రోడ్డు పై వివాదాలు పూర్తిగా ముగియక మునుపే.. మరో కొత్త వివాదం మొదలైంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.. 340కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల రీజినల్ రింగ్ రోడ్డును రాష్ట్రానికి కేటాయించింది. దీనికి సుమారు 16వేల కోట్లు అవసరంకాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం భరించాలి. అయితే ఇందులో సుమారు 5వేల 500 కోట్ల రూపాయలు ఒక్క భూసేకరణ కోసమే ఖర్చవుతోంది.

Advertisement

రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. అనేక ప్రాంతాల్లో భూములిచ్చేందుకు స్థానికులు నిరాకరించడంతో.. వారిని బుజ్జగించి భూమిని సేకరించడం అధికారులకు తలకుమించిన భారమైంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ భూ సేకరణ పూర్తికాలేదు. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రకటించారు. దీంతో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ చర్చనీయాంశమైంది. తక్షణమే భూసేకరణ జరపాలని రైల్వే అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి స్థానిక రైతులు భూములు అప్పగిస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×