E-Paper
Advertisement

Congress : గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరికలు..

Congress : గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరికలు..
Advertisement

Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. చాలామంది నేతలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, గద్వాల జిల్లా పరిషత్‌ ఛైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. 30 మంది సర్పంచ్‌లు, 12 మంది ఎంపీటీసీలు హస్తం గూటికి చేరారు. వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని విమర్శించారు. గద్వాల జిల్లా కాంగ్రెస్‌ కంచుకోటని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.

Advertisement

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వాలని సవాల్ చేశారు. కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రేవంత్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×