E-Paper
Advertisement

Jagtial: జగిత్యాలలో ఏసీబీ పంజా.. సీఐ, టీచర్ కలిసి చేసిన దందా మామూలుగా లేదుగా!

Jagtial: జగిత్యాలలో ఏసీబీ పంజా.. సీఐ, టీచర్ కలిసి చేసిన దందా మామూలుగా లేదుగా!
Advertisement

Jagtial: జగిత్యాల జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఏసీబీ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వహిస్తున్న గుండేటి రాము అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గతంలో ఆయన వేములవాడ ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో ఒక బెల్లం వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.

ఈ అవినీతి భాగోతంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా వ్యవహరించడం గమనార్హం. జక్కని వేణు అనే ఉపాధ్యాయుడు సీఐ రాముకు సహకరిస్తూ.. అక్రమంగా వచ్చిన డబ్బును తన బ్యాంకు ఖాతా ద్వారా సీఐ కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, బ్యాంకు ట్రాన్సాక్షన్ల ఆధారంగా అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.

Advertisement

జగిత్యాలలోని దరూర్ క్యాంపులో ఉన్న సీఐ నివాసంలో జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు సుమారు 20 లక్షల రూపాయల నగదును, భారీ ఎత్తున బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన ఏసీబీ బృందం వారిని కోర్టులో హాజరుపరిచింది. ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Also Read: గన్నేరు పప్పు తిని ఎస్సై భార్య ఆత్మహత్య.. కారణం తెలిస్తే?

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×