E-Paper
Advertisement

Online Game : ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన వివాహిత.. పిల్లలతో కలిసి ఆత్మహత్య..

Online Game : ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన వివాహిత.. పిల్లలతో కలిసి ఆత్మహత్య..
Advertisement
Online Game

Telangana news updates: ఆన్ లైన్ గేమింగ్ కు బానిసైన ఓ వివాహిత.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో చోటు చేసుకుంది. వలిగొండ మండలం గోల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశ్ భార్య రాజేశ్వరి.. ఈ దారుణానికి ఒడిగట్టింది. గత కొంత కాలంగా ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ.. బెట్టింగ్ కు పాల్పడుతోంది. ఈ క్రమంలో తెలిసినవారి నుంచి అప్పులు కూడా తీసుకుంది. అయితే గేమింగ్ యాప్ ల నుంచి ఎలాంటి డబ్బులు రాకపోవడమే కాకుండా.. అప్పులు తడిసి మోపెడయ్యాయి. బెట్టింగుల్లో ఏకంగా 8 లక్షలు పోగొట్టుకున్న రాజేశ్వరి.. చివరకు ప్రాణాలు తీసుకుంది.

Advertisement

తన ఇద్దరు పిల్లలైన మూడేళ్ల అనిరుధ్, రెండేళ్ల హర్షవర్ధన్ తో కలిసి.. నీటి సంపులో దూకింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు పోయాయి. ముగ్గురి మృతి పట్ల స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోధనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసలై.. చాలామంది భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో పలువురు తమ జీవితాలనే ఫణంగా పెడుతున్నారు. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అప్పులు ఎక్కువై.. తిరిగి చెల్లించలేక, ఒత్తిళ్లను తట్టుకోలేక బలైపోతున్నారు. ఆ కేటగిరీలో ఓ వివాహిత కూడా చేరడం.. పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×