E-Paper
Advertisement

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఆ రోజు ఎన్ని లక్షల మంది జర్నీ చేశారంటే..?

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు.. ఆ రోజు ఎన్ని లక్షల మంది జర్నీ చేశారంటే..?
Advertisement

Hyderabad Metro latest updates(Telangana today news): హైదరాబాద్‌ మెట్రో రైలు మరో రికార్డు సృష్టించింది. ఈ నెల 3న 5.10 లక్షల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారు. మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. కారిడార్‌-1 మియాపూర్‌–ఎల్‌బీనగర్‌ మార్గంలో ప్రయాణికుల సంఖ్యలో ఎక్కువగా ఉంది.

సోమవారం కారిడార్‌-1లో 2.60 లక్షల మంది ప్రయాణించారు. ఆ తర్వాత కారిడార్‌-3 నాగోల్‌– రాయదుర్గం మార్గం రెండో స్థానంలో ఉంది. ఈ రూట్ లో 2.25 లక్షల మంది జర్నీ చేశారు. రాయదుర్గం స్టేషన్‌ నుంచి అత్యధికంగా 32 వేల మంది ప్రయాణం చేశారు. ఎల్‌బీ నగర్‌ నుంచి 30 వేల మంది, అమీర్‌పేట్‌ నుంచి 29 వేల మంది, మియాపూర్‌ నుంచి 23 వేల మంది మెట్రోలో రాకపోకలు సాగించారు.

Advertisement

2017లో నవంబర్ 29న హైదరాబాద్‌ మెట్రోలో సర్వీసులు అందుబాటులో వచ్చాయి. 3 కారిడార్‌లలో 69 కిలో మీటర్లు మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 56 మెట్రో స్టేషన్‌లు ఉన్నాయి. కరోనా ప్రభావంతో కొన్నాళ్లు ప్రయాణికుల సంఖ్య తక్కువ ఉండేది. ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి కార్యాలయాలకు రావడంతో మెట్రోలో క్రమంగా రద్దీ పెరిగింది.

రోజు వారి మెట్రో ప్రయాణికులు 5.10 లక్షలు దాటిన నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. హైటెక్‌ సిటీకి వెళ్లే మార్గంలో మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×