E-Paper
Advertisement

Sanitation Workers: హైదరాబాద్‌లో దారుణం.. మ్యాన్‌హోల్లోకి దిగి ముగ్గురు మృతి..

Sanitation Workers: హైదరాబాద్‌లో దారుణం.. మ్యాన్‌హోల్లోకి దిగి ముగ్గురు మృతి..
Advertisement

3 Sanitation Workers Died While Cleaning Manhole: మార్చి 1న హైదరాబాద్‌లోని కుల్సుంపురా వద్ద మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందిన ఘటన నగరంలో కలకలం రేపింది.

Advertisement

మృతులను ఎం శ్రీనివాస్ (40), వి. హన్మంత్ (42) ఎం. వెంకటేశ్వర్ రావు (40) గా గుర్తించారు. కుల్సుంపురా సబ్ఇన్‌స్పెక్టర్ బి. మన్మోహన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1న శ్రీనివాస్ మ్యాన్‌హోల్ శుభ్రం చేయాడానికి కవర్ తెరిచాడు. బ్యాలెన్స్ తప్పి అందులో పడిపోయాడు.

శ్రీనివాస్‌ను కాపాడేందుకు తోటి కార్మికులు హన్మంత్, వెంకటేశ్వర్‌రావు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. అయితే వారు విషవాయువు పీల్చి స్పృహతప్పి పడిపోయారు. దీంతో వీరు ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. కాగా.. వారిని ఆదుకునేందుకు ప్రయత్నించిన మరో కార్మికుడు జీవన్ రాజ్ విషవాయువు పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు.

Advertisement

బాధితులు అయ్యప్ప ఇన్‌ఫ్రా కాంట్రాక్టు ఏజెన్సీ రోజువారీ వేతనంపై పని చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ అయ్యప్ప ఇన్‌ఫ్రా తమ కార్మికులకు శ్వాస మాస్క్‌లు అందించడంలో విఫలమైందని, ఇది ముగ్గురు వ్యక్తుల మరణానికి దారితీసిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు పారిశుధ్య కార్మికుల మృతిపై కాంట్రాక్టు ఏజెన్సీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×