E-Paper
Advertisement

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే
Advertisement

Jemimah Rodrigues: క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ని సొంతం చేసుకోవడంతో టీమిండియా క్రికెటర్ల బ్రాండ్ వ్యాల్యూ {Brand Value} భారీగా పెరిగింది. మంగళవారం నుండి కొన్ని బ్రాండ్లు కీలక ప్లేయర్లకు బ్రాండ్ ఎండార్స్మెంట్ అప్పగించేందుకు పరిశీలనలు మొదలుపెట్టాయి. పెద్ద సంఖ్యలో కంపెనీలు వీరితో సంప్రదింపులు చేస్తున్నాయని సమాచారం.

Also Read: World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Advertisement

కొత్త ఒప్పందాలు మాత్రమే కాకుండా.. కాంట్రాక్ట్ ఫీజులలో 25 -30 శాతం కంటే ఎక్కువ పెంచాలని విజ్ఞప్తులకు సంబంధించిన ఒప్పందాలపై కూడా పునఃచర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా పై అద్భుతమైన పోరాటం చేసిన బ్యాటర్ జమీమా రోడ్రిక్స్ {Jemimah Rodrigues} బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో 338 పరుగుల లక్ష్య చేదనలో 127 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచిన ఆమె ప్రదర్శన అభిమానులనే కాదు.. వ్యాపార కంపెనీలను సైతం ఆకర్షించింది. ఈ వరల్డ్ కప్ జమీమా జీవితాన్నే మార్చివేసింది.

100% పెరిగిన జమీమా బ్రాండ్ వ్యాల్యూ:

జమీమా రోడ్రిక్స్ బ్రాండ్ వ్యాల్యూ 100% పెరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జమీమా బ్రాండ్ ను నిర్వహించే {JSW} స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ మాట్లాడుతూ.. “ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత మాకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ లు వచ్చాయి. మేము 10 – 12 విభాగాలలోని బ్రాండ్లతో సంభాషణ జరుపుతున్నాము” అని చెప్పుకొచ్చారు. నివేదికల ప్రకారం జమీమా ఇప్పుడు బ్రాండ్ల లాంగివిటి, డెలివరీలను బట్టి రూ.75 లక్షల నుండి రూ. 1.5 కోట్ల వరకు ఫీజులు వసూలు చేస్తుందని సమాచారం. దేశంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్స్ స్మృతి మందాన.. రెక్సోనా, డియోడరెండ్, నైక్, హ్యుందాయ్, హెర్బాలైఫ్, ఎస్బిఐ, గల్ఫ్ ఆయిల్, పిఎన్బి సహా 16 బ్రాండ్లకు ఎండార్స్మెంట్ చేస్తోంది. ఇప్పుడు పలు కంపెనీలు జెమిమా భాగస్వామ్యం కోసం పోటీ పడుతున్నాయి. ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై గెలవడంతో భారత మహిళా క్రికెటర్లకు అపూర్వమైన గౌరవం ఏర్పడింది.

Advertisement

Also Read: PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

భారీగా పెరిగిన ఫాలోవర్లు:

చాలామంది క్రికెటర్ల సోషల్ మీడియా ఖాతాలకు ఈ రెండు రోజుల్లో ఫాలోవర్లు భారీగా పెరిగిపోయారు. ముఖ్యంగా జమీమాకి ఫాలోవర్లు భారీగా పెరిగారు. ఆస్ట్రేలియాపై సెంచరీ తో అజేయంగా నిలిచి భారత జట్టుని ఫైనల్ లోకి తీసుకువెళ్లిన ఈ యువ కెరటం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుంది. భారత్ లో క్రికెట్ కేంద్రంగా ఉన్న ముంబై నుండి క్రికెటర్ గా ఎదిగిన జమీమా.. సొంత గడ్డపై సాధించిన సెంచరీ ఆమెను మేటి క్రికెట్ క్రీడాకారిణుల జాబితాలో నిలబెట్టింది.

 

 

View this post on Instagram

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×