E-Paper
Advertisement

టీమిండియాకు ల‌క్ష్మ‌ణుడే శ్రీరామ ర‌క్ష‌..జింబాబ్వే ఓట‌మిపై శ్రీశాంత్ సంచ‌ల‌నం

టీమిండియాకు ల‌క్ష్మ‌ణుడే శ్రీరామ ర‌క్ష‌..జింబాబ్వే ఓట‌మిపై శ్రీశాంత్ సంచ‌ల‌నం
Advertisement

Sreesanth On IND VS ZIM: జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా (Zimbabwe vs India) నిన్న టి20 సిరీస్ (India tour of Zimbabwe 2026) షురూ అయింది. అయితే ఈ మూడు టి20 సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. నిన్న హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ (Harare Sports Club, Harare) వేదికగా బిగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) సేన, ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఏడు మ్యాచ్ ల‌ తర్వాత తొలి విజయం దక్కింది. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పైన శ్రీశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) శ్రీ రామరక్ష.. ఇకనైనా అతడిని కోచ్ గా నియామకం చేయండి అంటూ డిమాండ్ చేశారు. గౌతమ్ గంభీర్ వల్ల ఏది చేతకాదని.. జింబాబ్వే విజయం నమోదు చేసుకున్న నేపథ్యంలో… లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో వీవీఎస్ లక్ష్మణ్ గురించి శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ వ‌చ్చాడు..టీమిండియా గెలిచింది

Advertisement

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య టి20 సిరీస్ నిన్న ప్రారంభమైంది. అయితే ఈ టి20 సిరీస్ నేపథ్యంలో గంభీర్ ను పక్కకు పెట్టిన బీసీసీఐ… హైదరాబాద్ స్టైలిష్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ను బరిలోకి దించింది. అతని కోచింగ్ లోనే టీమిండియా… జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది. అయితే లక్ష్మణ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో… శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి విజయం నమోదయింది. ఈ క్రమంలో లక్ష్మణ్ ను టి20 కోచ్ గా కొనసాగించాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్ పక్కకు పెట్టాలని కోరుతున్నారు.

టీమిండియాకు ల‌క్ష్మ‌ణుడే శ్రీరామ ర‌క్ష‌..జింబాబ్వే ఓట‌మిపై శ్రీశాంత్ సంచ‌ల‌నం

టీమిండియా విజయం పై అటు శ్రీశాంత్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు VVS లక్ష్మణ్ శ్రీరామ రక్షలాంటివాడని వెల్లడించారు. గౌతమ్ గంభీర్ చెత్త వెధవలందరినీ టీమిండియాలోకి తీసుకువచ్చాడని… దానివల్ల టీమిండియా అభాసు పాలు ఫైర్ అయ్యారు. గౌతమ్ గంభీర్ చేతకానితనం వల్ల ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లలో టీమిండియా ఓడిపోయిందని… ఆగ్రహించారు. ఇకనైనా వీవీఎస్ లక్ష్మణ్ ను టీమిండియా హెడ్ కోచ్ గా నియామకం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్ కొనసాగితే… ఎక్కడైనా టీమిండియా గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇది ఇలా ఉండగా నిన్నటి మ్యాచ్ లో జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన జింబాబ్వే 125 పరుగులు సాధించింది. ఇక టీమిండియా ( Team India) లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది.

Advertisement

 

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×