E-Paper
Advertisement

ఐపీఎల్ వ‌ల్ల క్రికెట్ నాశం..బీసీసీఐ చేతిలో ఆస్ట్రేలియా కీలు బొమ్మ‌లా మారింది

ఐపీఎల్ వ‌ల్ల క్రికెట్ నాశం..బీసీసీఐ చేతిలో ఆస్ట్రేలియా కీలు బొమ్మ‌లా మారింది
Advertisement

Shahid Afridi:   పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia) మధ్య ఈ నెల చివరలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్లేయర్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఐపీఎల్ ఫినిష్ అయిన తర్వాతనే.. పాకిస్తాన్ టూర్ కు వెళ్లాలని ఈ కీలక ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా ( Cricket Australia). పాకిస్తాన్ టూర్ కు ప్రాముఖ్యత లేదని… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament) మాత్రమే ఆడాలంటూ దిశా నిర్దేశం చేసింది. దీంతో పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా తీసింది ఆస్ట్రేలియా. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) స్పందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వల్ల క్రికెట్ నాశనం అవుతుందని ఫైర్ అయ్యారు. బీసీసీఐ చేతిలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ కీలుబొమ్మలా మారిందని మండిపడ్డారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

ఐపీఎల్ వ‌ల్ల క్రికెట్ నాశం..ఆస్ట్రేలియా కీలు బొమ్మ‌లా మారింది

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) మే 31వ తేదీ వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ముగియకముందు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ ( Australia vs Pakistan) మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగానే మే 23వ తేదీన ఇస్లామాబాద్ కు క్రికెట్ ఆస్ట్రేలియా చేరుకుంటుంది. అనంతరం మే 30వ తేదీన వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు సంబంధించిన కీలక ప్లేయర్లు కమిన్స్, స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్ లాంటి వాళ్లందరూ పాకిస్తాన్ వెళ్లడం లేదు. ఐపీఎల్ లో షెడ్యూల్ ప్రకారం చివరి వరకు ఆడే ఆస్ట్రేలియా ఆటగాళ్లు… పాకిస్తాన్ టూర్ వెళ్లాల్సిన పనిలేదని వెల్లడించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఐపీఎల్ ఫినిష్ అయిన తర్వాత మాత్రమే రావాలని పేర్కొంది. పాకిస్తాన్ టూర్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా… ఆస్ట్రేలియా B టీమ్ ను రంగంలోకి దింపాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే దీనిపై తాజాగా షాహిద్ అఫ్రిది స్పందించాడు. ఐపీఎల్ వ‌ల్ల క్రికెట్ నాశం..బీసీసీఐ చేతిలో ఆస్ట్రేలియా కీలు బొమ్మ‌లా మారింది అంటూ షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఐపీఎల్ కోసం పాకిస్తాన్ వ‌న్డే సిరీస్ ను త‌క్కువ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజం అంటూ ఫైర్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లు సరిగ్గా నడవడం లేదని మండిపడ్డారు. దీనిపైన వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని కోరారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి కోసం అంతర్జాతీయ క్రికెట్ ను నాశనం చేయడం దుర్మార్గం అంటూ నిప్పులు చెరిగారు. ఆస్ట్రేలియా కు సంబంధించిన అందరూ ప్లేయర్లు కూడా పాకిస్తాన్ రావాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే ఐసీసీ కి లేఖ రాస్తానని హెచ్చరించారు.

Advertisement

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×