E-Paper
Advertisement

T20 WORLD CUP 2026: ఆ నిధులు ఆపేస్తాం, ఆడుక్కుతినేలా చేస్తామ‌ని అమిత్ షా, జై షా వార్నింగ్‌..తోక ముడిచిన పాకిస్తాన్‌

T20 WORLD CUP 2026: ఆ నిధులు ఆపేస్తాం, ఆడుక్కుతినేలా చేస్తామ‌ని అమిత్ షా, జై షా వార్నింగ్‌..తోక ముడిచిన పాకిస్తాన్‌
Advertisement

T20 WORLD CUP 2026:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 WORLD CUP 2026 ) నేపథ్యంలో ఇప్పటికే బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే అటు పాకిస్తాన్ కూడా ఈ టోర్నమెంట్ ఆడబోదని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడతామని ముందుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆడకపోతే, పడిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ బాస్ జై షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఇలా అర్ధాంతరంగా పాకిస్తాన్ వైదొలిగితే, ఐసీసీ నుంచి నిధులు ఆపేయడమే కాకుండా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ హోదాను రద్దు చేస్తామని ఐసిసి బాస్ జై షా హెచ్చరించారట. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

జై షా దెబ్బకు దిగి వచ్చిన పాకిస్తాన్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమంటూ పాకిస్తాన్ ( Pakistan) ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తేనే ఆడతామని వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలోనే ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో విదేశీ ప్లేయర్లు ఆడకుండా ఎన్ఓసి జారీ చేయబోమని ఐసీసీ బాస్ జై షా  ( ICC Jay Shah) హెచ్చరించారట.

అలాగే ఆసియా కప్ టోర్నమెంట్లో ఆడకుండా బ్యాన్ విధిస్తామని కూడా స్పష్టం చేశారట. ఇకపై వరల్డ్ కప్ వాడాలంటే ఖచ్చితంగా చిన్న జట్ల తరహాలో క్వాలిఫై మ్యాచ్లు కూడా ఆడాల్సిందేనని వెల్లడించారట. ర్యాంకింగ్ కూడా తొలగిస్తామని స్పష్టం చేశారట. అంతేకాదు ఆర్థికంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ( Pakistan Cricket Board) నష్టపరుస్తామని కూడా హెచ్చరించారట ఐసిసి బాస్ జై షా. 30 మిలియన్ల డాలర్లు పాకిస్తాన్ కు రాకుండా చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారట. ఈ ప్రకటన నేపథ్యంలో పాకిస్తాన్ తోక ముడిచినట్లు తెలుస్తోంది. నిన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమంటూ ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.. ఇవాళ జట్టును ప్రకటిస్తామని వెల్లడించింది. ఇక ఇవాళ ఏ క్ష‌ణ‌మైనా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నమెంట్ ఆడే జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

జై షా, అమిత్ షా దెబ్బ‌కు వ‌ణుకు

Advertisement

జై షా, అమిత్ షా ( Amit shah) భ‌యానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌ల‌వంచిన‌ట్లు నేష‌న‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. తండ్రి కొడుకులు ఇద్ద‌రూ పాకిస్తాన్ ను ఆడుకుంటున్నార‌ని అంటున్నారు. అమిత్ షా చెబితేనే ఐసీసీ అధ్య‌క్షుడిగా జై షా ( ICC Jay Shah) పాకిస్తాన్ కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×