E-Paper
Advertisement

Tanvir Ahmed: అది ఐపీఎల్ కాదు “ఫిక్సింగ్ లీగ్‌”…అందులో ఆడేది అంద‌రూ ఉగ్ర‌వాదులే !

Tanvir Ahmed: అది ఐపీఎల్ కాదు “ఫిక్సింగ్ లీగ్‌”…అందులో ఆడేది అంద‌రూ ఉగ్ర‌వాదులే !
Advertisement

Tanvir Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  ( T20 World Cup 2026 tournament )  పూర్తయిన 15 రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మార్చి 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanvir Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది ఐపీఎల్ ( IPL ) కాదని.. ఫిక్సింగ్ లీగ్ ( Fixing League) అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అందులో ఆడేది అందరూ ఉగ్రవాదులే ( Terrorist) అంటూ బాంబు పేల్చారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.

Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శ‌ర్మకు ఘోర అవ‌మానం…చెప్పులు చూపించిన యువ‌రాజు

అది ఐపీఎల్ కాదు “ఫిక్సింగ్ లీగ్‌”…అందులో ఆడేది అంద‌రూ ఉగ్ర‌వాదులే !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన విషం కక్కాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. ఇది ఐపీఎల్ కాదని.. ఫిక్సింగ్ లీగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఆడేది అందరూ వెధవలె అంటూ మండిపడ్డారు. ప్రపంచంలో ఉన్న క్రికెట్ బోర్డులను శాసించేందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును బీసీసీఐ నడిపిస్తోందని ఫైర్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కాకముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి క్రికెట్ బోర్డులు చాలా బలంగా ఉండేవి అని తెలిపారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. కానీ ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు బలహీనమైపోయాయని ఆరోపణలు చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కాక ముందు అందరూ ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుల గురించి మాట్లాడుకునేవారు… ఆ రెండు క్రికెట్ బోర్డులు చాలా బలమైనవి అని చెప్పుకునేవారు… కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శలు చేశారు. వాటిని బలహీనం చేసింది బీసీసీఐ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తన్వీర్ అహ్మద్. ఐపీఎల్ కారణంగా ప్లేయర్ లందరూ డబ్బు కోసం మాత్రమే ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రపంచంలో ఐపిఎల్ కంటే ఎక్కువ ఏ లీగ్ డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్లి ఆడే లాగా తయారయ్యారని విమర్శలు చేశారు. క్రికెట్ వ్యవస్థను మొత్తం నాశనం చేసింది ఐపీఎల్ అంటూ ఆరోపణలు చేశారు. అయితే తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇక అటు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ పైన కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నాడు త‌న్వీర్ అహ్మ‌ద్. టీమిండియా సెమీ ఫైన‌ల్ కు వెళ్లేందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

Advertisement

 

 

Also Read: Rinku Singh’s father dies: రింకూ ఇంట విషాదం..టీమిండియా ప్లేయ‌ర్లకు అసలు సిగ్గుందా..రీల్స్ చేస్తూ చేస్తారా?

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×