E-Paper
Advertisement

సూర్య పెద్ద పోటుగాడా ? వాడి కెప్టెన్సీలోనూ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయేవాళ్లం

సూర్య పెద్ద పోటుగాడా ? వాడి కెప్టెన్సీలోనూ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయేవాళ్లం
Advertisement

Navjot Singh Sidhu:  టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ ( Team India Vs Ireland) మధ్య ఇటీవల టి20 సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన టీమిండియాను వైట్ వాష్ చేసింది పసికూన ఐర్లాండ్. ఈ క్రమంలో టీమిండియా పురుషుల జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. టీమిండియా పని అయిపోయిందని… ఇక వాళ్లు కోలుకోవడం కష్టమే అని అంటున్నారు. వాళ్ల స్థానాన్ని పాకిస్తాన్ భర్తీ చేస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి క్రమంలో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ ( Navjot Singh Sidhu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ని చాలా మంది విమర్శలు చేస్తున్నారని…అది చాలా త‌ప్ప‌న్నారు.

Also Read: Rajasthan-born Jai Moondra moved to Dublin : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

Advertisement

సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఐర్లాండ్ సిరీస్ కు టీమిండియా వెళ్లినా ఫలితం దక్కేది కాదని బాంబు పేల్చాడు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించిన కూడా.. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ తప్పకపోయేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఐపీఎల్ కు అలవాటైందని.. ఈ క్రమంలో ఒక్కసారిగా ఐర్లాండ్ మైదానాలలో బంతులను తట్టుకోలేకపోయారని వివరించారు. అందుకే టీమిండియా ఓడిపోయింది అన్నారు. లేకపోయి ఉంటే టీమిండియా కచ్చితంగా రానిచ్చేదని చెప్పారు మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ. ఈ క్ర‌మంలో మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

సూర్య కెప్టెన్సీలోనూ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయేవాళ్లం

ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన క్రమంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ కు సపోర్ట్ గా నిలిచారు టీమిండియా మాజీ ఆటగాడు మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నా కూడా… ఐర్లాండ్ చేతిలో సిరీస్ ను టీమిండియా కోల్పోయేదని క్లారిటీ ఇచ్చారు. టీమిండియాలో ప్లేయర్లు అందరూ సమిష్టిగా ఆడి ఉంటేనే జట్టు గెలుస్తుందని పేర్కొన్నారు.

Advertisement

అలాగే ఐపీఎల్ కు అలవాటైన టీమిండియా క్రికెటర్లు… ఒకసారి గా విదేశీ మైదానంలో ఆడే సరికి బెంబేలెత్తిపోయారన్నారు. అందుకే టీమిండియా ఓడిపోయిందని కుండబద్దలు కొట్టి చెప్పారు. అంతేగాని శ్రేయస్ అయ్యర్ ఒక్కడినే విలన్ చేయకూడదని కోరారు. ఐర్లాండ్ లో భారీగా వర్షాలు పడడం, అక్కడి వాతావరణాన్ని టీమిండియా ప్లేయర్లు అలవాటు చేసుకోకపోవడం కారణంగా కూడా ఓటమి ఎదురైందన్నారు. అనవసరంగా శ్రేయస్ అయ్యర్ ను బ్లెం చేయకూడదని కోరారు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా కచ్చితంగా ఇంగ్లాండ్ లో మెరుగ్గా రాణిస్తుందని ప్రకటించారు మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ.

Also Read: Muhammad Waseem Blames Team India టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×