E-Paper
Advertisement

Messi: టీమ్ సభ్యులకు బంగారు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ

Messi: టీమ్ సభ్యులకు బంగారు ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన మెస్సీ
Advertisement

Messi: గతేడాది డిసెంబర్‌లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో గెలుపొందింది. ఈ విజయం సాధించి మూడు నెలలు అవుతున్నా జట్టు సభ్యులు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక టీమ్ కెప్టెన్‌ మెస్సి జట్టు సభ్యులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఫిఫాలో విజయం సాధించినందుకు గుర్తుగా తమ జట్టులోని సభ్యులకు, సిబ్బందికి మరిచిపోలేని బహుమతి అందజేశాడు. మొత్తం 35 మందికి బంగారు ఐఫోన్‌లను ఇచ్చాడు. 24 క్యారెట్ల బంగారంతో రూ.1.72 కోట్లు పెట్టి ఆ ఫోన్లను ప్రత్యేకంగా తయారు చేయించాడు.

Advertisement

ఐడిజైన్ అనే గోల్డ్ సంస్థ ద్వారా ఈ ఫోన్లను తయారు చేయించాడు. ప్రతి ఫోన్ వెనుక భాగంలో అర్జెంటీనా లోగో, క్రీడాకారుడి పేరు, జెర్సీ నంబర్, వరల్డ్ కప్ ఛాంపియన్స్2022 అని వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ప్రస్తుతం ఈ ఫోన్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×