E-Paper
Advertisement

KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ

KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ
Advertisement

KL Rahul:  దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య విశాఖ వేదికగా జరిగిన మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ ఘోర అవమానం ఎదురయింది. టీమిండియా జ‌ట్టులోకి సీనియ‌ర్ ప్లేయ‌ర్ అయిన విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు ఎవరు పట్టించుకోవడం లేదు. టీమిండియాలో అతనికి విలువ లేనట్లే అని తెలుస్తోంది. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కె ఎల్ రాహుల్ కు సలహాలు ఇచ్చేందుకు విరాట్ కోహ్లీ దగ్గరికి వస్తే, అతన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు రాహుల్. చాలు..చాలు నువ్వు చెప్పింది చాలు అన్న రేంజ్ లో విరాట్ కోహ్లీ పరువు తీసాడు కేఎల్ రాహుల్. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

విరాట్ కోహ్లీని పట్టించుకోని టీమిండియా కెప్టెన్ రాహుల్

Advertisement

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికా తో జరిగిన మూడవ వన్డేలో విరాట్ కోహ్లీని గౌతమ్ గంభీర్ కంటే దారుణంగా అవమానించాడు కేఎల్ రాహుల్. స్లిప్ లో మరొక పిల్డ‌ర్ ను పెట్టాలని, వికెట్ కీపర్ కం కెప్టెన్ కేఎల్ రాహుల్‌ దగ్గరకు వచ్చి విరాట్ కోహ్లీ కాస్త సలహాలు ఇచ్చాడు. అయితే ఆ సలహాలు విన్న కేఎల్ రాహుల్, నీ సలహాలు తనకి ఏమీ అవసరం లేదు అన్న రేంజ్ లో రియాక్షన్స్ ఇచ్చాడు. స్లిప్ లో ఫిల్టర్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఉన్నాడు కదా ఇంకెందుకు? అంటూ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. నువ్వు ప‌క్క‌కు వెళ్లి ఆడుకో అన్న రేంజ్ లో రియాక్ట్ అయ్యాడు. దీంతో ఒక కంగు తిన్న విరాట్ కోహ్లీ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా పరిశీలిస్తున్న రోహిత్ శర్మ, పగలబడి నవ్వుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. విరాట్ కోహ్లీని అవమానించిన రాహుల్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. కెప్టెన్సీ వ‌చ్చింద‌ని విర్ర‌వీగుతున్నాడ‌ని కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి ఫైర్ అవుతున్నారు కోహ్లీ ఫ్యాన్స్‌.

వ‌న్డే సిరీస్ టీమిండియా వ‌శం

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య నిన్నటితో వన్డే సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో టీమిండియా కైవసం చేసుకుంది. మొదటి వన్డే అలాగే చివరి వన్డేలో విజయం సాధించిన టీమిండియా, 2-1 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మొదట రెండు టెస్టుల సిరీస్ జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీమ్ ఇండియా పరువు మొత్తం పోయింది. అయితే దానికి ప్ర‌తికారంగా ఇప్పుడు వ‌న్డే సిరీస్ కైవసం చేసుకుంది టీం ఇండియా జట్టు. దీంతో లెక్క సరిపోయింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ రెండు జ‌ట్ల మధ్య ఐదు టీ20 ల సిరీస్ జరగనుంది.

Advertisement

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×