E-Paper
Advertisement

IND vs ENG Fourth Test: ముగిసిన తొలిరోజు ఆట.. రూట్ సెంచరీ.. ఇంగ్లాండ్ 302/7..

IND vs ENG Fourth Test: ముగిసిన తొలిరోజు ఆట.. రూట్ సెంచరీ.. ఇంగ్లాండ్ 302/7..
Advertisement
live sports news

IND vs ENG Fourth Test Updates: రాంచీ వేదికగా ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ సెంచరీ సాధించాడు. క్రీజులో రూట్ ( 106*), రాబిన్సన్ (31*) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్‌తో అరంగ్రేటం చేసిన ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. 47 పరుగుల వద్ద బెన్ డకెట్ (11) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో ఓలీ పోప్‌(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన ఓపెనర్ జాక్ క్రాలీ(42, 42 బంతుల్లో)ని క్లీన్ బౌల్డ్ చేశాడు.

Advertisement

Read More: ఇంగ్లాండుపై అశ్విన్ వంద వికెట్ల పండుగ.. తొలి భారత బౌలర్ గా రికార్డ్!

57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రూట్, బెయిర్ స్టో ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ బెయిర్ స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ వెంటనే కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను జడేజా ఎల్బీగా అవుట్ చేశాడు. 112 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రూట్, కీపర్ ఫోక్స్ ఆదుకున్నారు. టీ తర్వాత ఫోక్స్(47) సిరాజ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టామ్ హార్ట్లీ(13)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు.

Advertisement

భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×